CEC Calls
విధాత: ఏపీలో ఓట్ల గల్లంతుపై సీఈసీకి ఫిర్యాదు అందడంతో ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది. ఓటర్ల జాబితాతో రావాలని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు వచ్చాయి.
దీంతో ముఖేశ్ కుమార్ మీనా హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం సీఈసీతో భేటీ కానున్నారని తెలుస్తోంది.