CM JAGAN | సీజనల్ యాగం.. జగన్‌కు మళ్లీ CM యోగం

CM JAGAN విధాత‌: ఆంధ్ర.. తెలంగాణల్లో రాజకీయాలు జోరుమీదున్నాయి. మళ్లీ సీఎం అవ్వాలని అటు కేసీఆర్ ఇటు జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే మానవ ప్రయత్నం ఎంత ఉన్నాకాని దైవ ఆశీస్సులు ఉండాలని ఇద్దరు ముఖ్యమంత్రులు బలంగా నమ్ముతారు. గత ఎన్నికలకు ముందు భారీగా రాజ శ్యామల యాగం చేసిన కేసీఆర్ దాని ఫలితమే అన్నట్లుగా సీఎం అయ్యారు. ఇక పెందుర్తి స్వరూపానందేంద్ర స్వామి కూడా యాగం, తపస్సు చేయడంతో జగన్ కూడా సీఎం అయ్యారని నమ్ముతున్నారు. […]

  • Publish Date - May 4, 2023 / 02:24 PM IST

CM JAGAN

విధాత‌: ఆంధ్ర.. తెలంగాణల్లో రాజకీయాలు జోరుమీదున్నాయి. మళ్లీ సీఎం అవ్వాలని అటు కేసీఆర్ ఇటు జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే మానవ ప్రయత్నం ఎంత ఉన్నాకాని దైవ ఆశీస్సులు ఉండాలని ఇద్దరు ముఖ్యమంత్రులు బలంగా నమ్ముతారు. గత ఎన్నికలకు ముందు భారీగా రాజ శ్యామల యాగం చేసిన కేసీఆర్ దాని ఫలితమే అన్నట్లుగా సీఎం అయ్యారు.

ఇక పెందుర్తి స్వరూపానందేంద్ర స్వామి కూడా యాగం, తపస్సు చేయడంతో జగన్ కూడా సీఎం అయ్యారని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికల సీజన్ రావడంతో యాగం చేసే పనిలో ఏపి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

ఏపి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ లోక కల్యాణం కోసం రాజశ్యామల యాగం చేయిస్తున్నామని చెప్పారు. అంటే దాని అర్థం మళ్లీ జగన్ సీఎం అవ్వాలని కోరుతూ యాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కాస్తా పొలిటికల్ రంగు అద్దేశారు.

దీనిమీద మాజీ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ జగన్ కి అధికారం కావాలనుకుంటే సొంత డబ్బుతో యాగం చేయించుకోవాలి కానీ దేవాదాయ శాఖ సొమ్ముతో చేయడం ఏమిటని అంటున్నారు.

అంతేకాకుండా టీటీడీ నుంచి రెండున్నర కోట్లు ఈ యాగానికి మళ్ళించారని బోండా అంటున్నారు. అసలు రాజశ్యామల యాగం చేసే అర్హత కూడా జగన్ కి లేదని అన్నారు. మొత్తానికి టిడిపికి ఈ యాగం భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది.

Latest News