CM KCR | ప్రపంచ బాక్సింగ్ చాంపియన్.. నిఖత్ జరీన్‌కు రూ.2కోట్లు

CM KCR విధాత: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదికల మీద విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన నిఖత్ జరీన్ కు రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్లొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు. సచివాలయం లో నిఖత్ జరీన్ […]

  • Publish Date - May 18, 2023 / 07:07 AM IST

CM KCR

విధాత: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు.

ఇప్పటికే పలు ప్రపంచ వేదికల మీద విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన నిఖత్ జరీన్ కు రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్లొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు.

సచివాలయం లో నిఖత్ జరీన్ సిఎం కేసీఆర్ గారితో గురువారం నాడు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సిఎం స్పష్టం చేశారు.

అందుకు సంబంధించిన ఖర్చుల కోసం గాను రూ. 2 కోట్లను సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.

ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు మంత్రులు మహమూద్ అలి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సిఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Latest News