విధాత: కాంగ్రెస్ స్ట్రాటజీ చైర్మన్ సునీల్ ఆఫీస్ను సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రాత్రి సీజ్ చేశారు. ఆఫీసులోని ఉద్యోగులను బయటకు పంపిన పోలీసులు ఆఫీసును తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యల పోస్టింగులు సునీల్ కార్యాలయం నుంచే వెళ్లినట్టు ఫిర్యాదులు వెళ్లాయి.
సునీల్ బృందం రెండు ఫేస్బుక్ పేజీలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 గ్రూపులో సునీల్ బృందం పనిచేస్తుంది. సునీల్ కార్యాలయంను పోలీసులు సీజ్ చేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ హుటా హుటిన కార్యాలయం వద్దకు చేరుకున్నారు.