Site icon vidhaatha

COVID-19 | దేశంలో కరోనా తగ్గని ఉధృతి.. మరోసారి 10వేలుకుపైగా కొత్త కేసులు నమోదు..

Covid-19 | దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇటీవల నిత్యం 10వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 10,112 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 67,806కి చేరింది. వైరస్‌ కారణంగా 29 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,31,329కు పెరిగింది. మరణాల్లో ఎక్కువగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కొవిడ్‌ రికవరీ రేటు 98.66శాతం ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 4,42,92,854 మంది రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం మరణాల రేటు 1.18శాతంగా ఉందని, ఇప్పటి వరకు 220.66 వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది.

Exit mobile version