Raja Singh: గోవధ నిషేధ చట్టం తెచ్చేందుకు కేంద్రం పార్లమెంటులో బిల్లు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి, ముఖ్యమంత్రులకు తాకుతుందన్నారు. తరతరాలుగా వారిని ఆ పాపం వెన్నాడుతుందన్నారు. గతంలో గోవధ నిషేధానికి ప్రైవేట్ బిల్లుకు ఎంపీలు మద్దతునివ్వలేదని విమర్శించారు. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ సహా దేశంలో వ్యవసాయానికి, పాడి పోషణకు పనికివచ్చే ఆవులు, ఎద్దులను కూడా వధిస్తున్నారని..వీధుల్లోని చెత్త కుప్పల్లో వాటి వ్యర్థాలే కనిపిస్తుంటాయని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఐదురోజులుగా అరెస్టు చేశారని..కాని వీధుల్లో పోలీస్ రక్షణలో బక్రీద్ సందర్భంగా ఆవులను, ఎద్దులను, వాటి పిల్లలను అమ్ముతున్నారని, వధిస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. అయినా ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు నోరుమూసుకుని ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ఆవులను హతమార్చే వారితో పాటు వాటిని నివారించలేని ప్రజాప్రతినిధులకు కూడా ఆ పాపం తగులుతుందన్నారు. దేశ ప్రజలు ముఖ్యంగా హిందువులు పవిత్రంగా భావించే గోమాతను జాతీయ పశువుగా ప్రకటించాలని..గో వధ నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని..బిల్లుకు దేశంలోని ప్రతి ఎంపీ మద్ధతనివ్వాలని కోరారు.
Raja Singh: గోవధ నిషేధ చట్టం తేవాలి : రాజాసింగ్
Raja Singh: గోవధ నిషేధ చట్టం తెచ్చేందుకు కేంద్రం పార్లమెంటులో బిల్లు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి, ముఖ్యమంత్రులకు తాకుతుందన్నారు. తరతరాలుగా వారిని ఆ పాపం వెన్నాడుతుందన్నారు. గతంలో గోవధ నిషేధానికి ప్రైవేట్ బిల్లుకు ఎంపీలు మద్దతునివ్వలేదని విమర్శించారు. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ సహా దేశంలో వ్యవసాయానికి, పాడి పోషణకు పనికివచ్చే ఆవులు, ఎద్దులను కూడా వధిస్తున్నారని..వీధుల్లోని చెత్త కుప్పల్లో […]

Latest News
మరికొన్ని గంటల వరకూ అన్ని పార్టీలకూ గుండె గుబులే.. ఫలితాలు వచ్చాక కలవరమే
మెగా రైతు మేళా వర్సెస్ రైతు సంగ్రామ సదస్సు... ఒకే రోజు కాంగ్రెస్, బీఆరెస్ పోటాపోటీ కార్యక్రమాలు
బిగ్ డే..రేపు ఐదు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు !
మత్తు బాబులకు తెలంగాణలో షాక్.. ఫుల్బాటిల్పై కనీస బాదుడు రూ.60?
ఒకే వేదికపై నాగచైతన్య–సమంత..
బాలకృష్ణ ప్రేమకథపై ఆసక్తికర వివరాలు..
ముందుగానే రుతుపవనాల రాక..ఈ నెలలోనే అండమాన్ కు!
భానుడి భగభగల వేళ..వాతావరణ శాఖ చల్లని కబురు!
కేంద్రం బాసటతోనే తెలంగాణ సర్కార్.. రైతాంగం మనుగడ: ఎంపీ కొండా
మినీ టైటానిక్ విషాదం..ఆ బోటు ప్రమాదం