Raja Singh: గోవధ నిషేధ చట్టం తెచ్చేందుకు కేంద్రం పార్లమెంటులో బిల్లు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి, ముఖ్యమంత్రులకు తాకుతుందన్నారు. తరతరాలుగా వారిని ఆ పాపం వెన్నాడుతుందన్నారు. గతంలో గోవధ నిషేధానికి ప్రైవేట్ బిల్లుకు ఎంపీలు మద్దతునివ్వలేదని విమర్శించారు. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ సహా దేశంలో వ్యవసాయానికి, పాడి పోషణకు పనికివచ్చే ఆవులు, ఎద్దులను కూడా వధిస్తున్నారని..వీధుల్లోని చెత్త కుప్పల్లో వాటి వ్యర్థాలే కనిపిస్తుంటాయని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఐదురోజులుగా అరెస్టు చేశారని..కాని వీధుల్లో పోలీస్ రక్షణలో బక్రీద్ సందర్భంగా ఆవులను, ఎద్దులను, వాటి పిల్లలను అమ్ముతున్నారని, వధిస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. అయినా ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు నోరుమూసుకుని ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ఆవులను హతమార్చే వారితో పాటు వాటిని నివారించలేని ప్రజాప్రతినిధులకు కూడా ఆ పాపం తగులుతుందన్నారు. దేశ ప్రజలు ముఖ్యంగా హిందువులు పవిత్రంగా భావించే గోమాతను జాతీయ పశువుగా ప్రకటించాలని..గో వధ నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని..బిల్లుకు దేశంలోని ప్రతి ఎంపీ మద్ధతనివ్వాలని కోరారు.
Raja Singh: గోవధ నిషేధ చట్టం తేవాలి : రాజాసింగ్
Raja Singh: గోవధ నిషేధ చట్టం తెచ్చేందుకు కేంద్రం పార్లమెంటులో బిల్లు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి, ముఖ్యమంత్రులకు తాకుతుందన్నారు. తరతరాలుగా వారిని ఆ పాపం వెన్నాడుతుందన్నారు. గతంలో గోవధ నిషేధానికి ప్రైవేట్ బిల్లుకు ఎంపీలు మద్దతునివ్వలేదని విమర్శించారు. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ సహా దేశంలో వ్యవసాయానికి, పాడి పోషణకు పనికివచ్చే ఆవులు, ఎద్దులను కూడా వధిస్తున్నారని..వీధుల్లోని చెత్త కుప్పల్లో […]

Latest News
పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందా.. ఈ మూడు చిట్కాలు పాటిస్తే సరి!
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన ఫిలిప్పీన్స్!
మందుబాబులకు బిగ్ షాక్.. యుద్ధం ఎఫెక్ట్తో భారీగా పెరగనున్న బీర్ల ధరలు!
సెల్ఫీ మిర్రర్తో భారత్లో తొలి ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సర్ప్రైజ్!
ఉపాధి హామీ పథకంలో వరంగల్కు అన్యాయం : లోక్సభలో ఎంపీ కావ్య
రెడ్లలో రేవంత్ అంత బాహుబలి లేడు.. ఎప్పటికైనా సీఎం అవుతానన్న మల్లారెడ్డి
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ
9 లక్షల సాదాబైనామాలకు త్వరలో పరిష్కారం : మండలిలో మంత్రి పొంగులేటి
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు
‘Arrive Alive’తో పల్లెల్లోకి పోలీసులు.. ప్రజా భద్రత అంశాలపై చైతన్యం