కుంగుతున్న దేవ‌భూమి జోషి మ‌ఠ్‌! భయాందోళనలో ప్రజలు

భవిష్యత్‌లో నైనిటాల్‌, ఉత్తరకాశీలో కూడా.. జోషిమఠ్‌లో పరిస్థితులపై అప్రమత్తమైన కేంద్రం..! సీఎం పుష్క‌ర్ సింగ్‌ధామి ప‌ర్య‌ట‌న‌.. ఇళ్లకు బీట‌లు.. సుర‌క్షిత ప్రాంతాల‌కు ప‌లు కుటుంబాలు త‌ర‌లింపు ప్ర‌కృతితో పోరాడి గెల‌వ‌లేమని హెచ్చ‌రిస్తున్న జియాల‌జిస్టులు డెహ్రాడూన్‌: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ని జోషిమఠ్‌ పట్టణం కుంగిపోతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమతమయ్యాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రమాదం అంచున ఉన్న కుటుంబాలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. […]

  • Publish Date - January 8, 2023 / 02:40 PM IST
  • భవిష్యత్‌లో నైనిటాల్‌, ఉత్తరకాశీలో కూడా..
  • జోషిమఠ్‌లో పరిస్థితులపై అప్రమత్తమైన కేంద్రం..!
  • సీఎం పుష్క‌ర్ సింగ్‌ధామి ప‌ర్య‌ట‌న‌..
  • ఇళ్లకు బీట‌లు.. సుర‌క్షిత ప్రాంతాల‌కు ప‌లు కుటుంబాలు త‌ర‌లింపు
  • ప్ర‌కృతితో పోరాడి గెల‌వ‌లేమని హెచ్చ‌రిస్తున్న జియాల‌జిస్టులు

డెహ్రాడూన్‌: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ని జోషిమఠ్‌ పట్టణం కుంగిపోతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమతమయ్యాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్‌లో పర్యటించారు.

ఈ సందర్భంగా ప్రమాదం అంచున ఉన్న కుటుంబాలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు ఇప్పటి వరకు 500 ఇండ్లకుపైగా ఇండ్లు పగుళ్లు, బీటలు వారాయి. మరో వైపు జోషిమఠ్‌లో పరిస్థితులపై ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నతస్థాయి సమావేశమై చర్చిస్తున్నది.