అకాల వర్షాలకు తోటల ధ్వంసం.. రైతన్నకు నష్టం

అకాల వర్షాల ధాటికి వరి, మొక్కజొన్న సాగుచేసే రైతులతో పాటు మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు చేస్తున్న రైతులు సైతం నష్టపోవాల్సివస్తుంది

  • Publish Date - April 19, 2024 / 05:20 PM IST

విధాత : అకాల వర్షాల ధాటికి వరి, మొక్కజొన్న సాగుచేసే రైతులతో పాటు మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు చేస్తున్న రైతులు సైతం నష్టపోవాల్సివస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన గుర్రాల బల్వంత్ రెడ్డి 7ఎకరాలలో బొప్పాయి సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట పూర్తిగా నేల పాలు అయింది. ఈదురుగాలులతో కూడిన వాన దెబ్బకు బొప్పాయి చెట్లు విరిగి, కాయలు రాలిపోయాయి. దీంతో రైతు శ్రమ, పెట్టుబడులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు అభ్యర్థించారు.

Latest News