విధాత: ఇటీవల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. భారీగా పెరుగుతున్న కాస్త స్వల్పంగా తగ్గుతున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండడంతో పుత్తడికి భారీగా డిమాండ్ ఉన్నది. శనివారం బులియన్ మార్కెట్లో ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.56,800 పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,970 వద్ద ట్రేడవుతున్నది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,120 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,970 వద్ద కొనసాగుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.57,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,500 వద్ద ట్రేడవుతున్నది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల స్వర్ణం రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,970 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రూ.76,200 వద్ద నిలకడగా ఉండగా.. హైదరాబాద్లో వెండి కిలోకు రూ.79,200 పలుకుతున్నది.