విధాత: బంగారం ధరలు మగువలకు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్లు ధరలు మళ్లీ పెరిగాయి. మొన్న భారీగా రేటు పెరగ్గా.. నిన్న కాస్త దిగివచ్చింది. తాజాగా శనివారం మరోసారి ధర పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.200 పెరిగి.. తులానికి రూ.57,700 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.220 పెరిగి రూ.62,950కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లోనూ బంగారం ధలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,100 పలుకుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.62,950కి పెరిగింది. చెన్నైలో 22క్యారెట్ల పుత్తడి రూ.58,500 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,820 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,950కి చేరింది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వెండి వెండి ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. రూ.300 పెరుగడంతో కిలో రూ.79,500 పలుకుతున్నది. హైదరాబాద్లో వెండి రూ.82,500కు పెరిగింది.