Site icon vidhaatha

Gold Rate | సామాన్యులకు షాక్‌.. మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..! నేడు తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బంగారం వెండి ధరలు సామాన్యులకు షాక్‌ ఇచ్చాయి. నిన్న తగ్గిన పుత్తడి, వెండి ధరలు ఆదివారం పెరిగాయి. 22 క్యారెట్ల పసడి ధర రూ.250 పెరిగి.. రూ.55,350కి చేరింది.

ఇక 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.270 మేర పెరిగి.. రూ.60,380 పలుకుతున్నది. కిలో వెండిపై రూ.600 పెరిగి.. రూ.77వేల వద్ద ట్రేడవుతున్నది.

ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,530కి చేరింది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.రూ.60,380కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,710 వద్ద కొనసాగుతున్నది.

బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్లు రూ.60,380 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,350 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,380కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు వరంగల్‌, కరీంనగర్‌ తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80వేలకు పెరిగింది.

Exit mobile version