విధాత: మునుగోడు ఉప ఎన్నికల్లో 6,30,42,510రూపాయల నగదు పట్టుకున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. మరో రెండు కోట్ల విలువైన మద్యం, గంజాయి, బంగారం, ఆభరణాలు, కుక్కర్లు, చీరలు, ఇతర వస్తువులను పట్టుకున్నట్లుగా తెలిపారు.
హైదరాబాద్కు చెందిన రాబీన్ ఆర్టీఐ చట్టం ప్రకారం అడిగిన వివరాల మేరకు ఎన్నికల సంఘం సదరు లెక్కలు వెల్లడించింది.