అమెరికాలో భారతీయ విద్యార్థి కాల్చివేత

అమెరికాలోని ఓహియోలో 26 ఏళ్ల భారతీయ విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మృతుడిని ఆదిత్య అద్లఖాగా గుర్తించారు.

  • Publish Date - November 24, 2023 / 10:44 AM IST

వాషింగ్టన్ : అమెరికాలోని ఓహియోలో 26 ఏళ్ల భారతీయ విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మృతుడిని ఆదిత్య అద్లఖాగా గుర్తించారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ సెంటర్‌లో మాలిక్యులర్ అండ్ డెవలప్‌మెంట్‌ బయాలజీ ప్రోగ్రాంలో నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల ప్రారంభంలో ఆదిత్య అద్లఖా మరణించినట్లు సమాచారం. నవంబర్ 9న సిన్సినాటి పోలీసులు ఒక కారులో గాయపడిన యువకుడిని గుర్తించారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినిపించాయని పోలీసులు తెలిపారు.


బుల్లెట్ గుర్తులు ఉన్న కారు లోపల గాయపడి ఉన్న వ్యక్తి గురించి ప్రయాణిస్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అద్లఖాను దవాఖానకు తరలించగా.. అక్కడ అతను రెండు రోజుల తర్వాత మరణించాడు. ఈ కేసులో ప్రస్తుతం ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని స్థానిక మీడియా పేర్కొంది. ఆదిత్య అద్లఖా ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉత్తర భారత్‌ నుండి సిన్సినాటికి వచ్చారు. 2018లో ఢిల్లీ యూనివర్సిటీలోని రాంజాస్ కాలేజీ నుండి జీవశాస్త్రంలో బ్యాచ్‌లర్ డిగ్రీని అందుకున్నాడు. 2020లో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పిజియాలజీలో పీజీ చేశారు.

Latest News