మోడీ తమది రైతు ప్రభుత్వం అనడం సిగ్గుచేటు: మంత్రి జగదీష్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై  ఫైర్ విధాత: వ్యవసాయానికి బీజేపీ హయాంలో తెలంగాణ‌కు ఎక్కువ నిధులు కేటాయించామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారన్న భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైరయ్యారు. కిషన్ రెడ్డి , బండి సంజయ్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. […]

  • Publish Date - December 24, 2022 / 10:02 AM IST

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై ఫైర్

విధాత: వ్యవసాయానికి బీజేపీ హయాంలో తెలంగాణ‌కు ఎక్కువ నిధులు కేటాయించామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారన్న భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైరయ్యారు.

కిషన్ రెడ్డి , బండి సంజయ్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న మోడీ యత్నాన్ని దేశ రైతులు ప్రతిఘటించగా క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తుంచు కోవాలని విమర్శించారు. మోడీ రైతు విధానాలు నచ్చక నెలల పాటు రైతులు రోడ్డెక్కితే మాది రైతు ప్రభుత్వం అనడం సిగ్గుచేటని మంత్రి అన్నారు.

ఢిల్లీలో రైతులు మోడీ గో బ్యాక్ అంటుంటే.. తెలంగాణా సరిహద్దు రైతులు మమ్మల్ని తెలంగాణాలో కలపండి అని అడుగుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తుచేశారు. బీజేపీకి తెలంగాణ‌కు ఉన్న తేడా ఇదే అని అన్నారు. కేసీఆర్ అభివృద్ధి ఫలాల కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని, అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశార‌ని మంత్రి అన్నారు.