పెద్దగట్టు జాతర ఏర్పాట్ల పై మంత్రి జగదీష్‌రెడ్డి సమీక్ష

వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జాతర విధాత: రాష్టంలో రెండో అతి పెద్ద జాతరయిన దురాజ్ పల్లి పెద్ద గట్టు జాతర ఏర్పాట్లపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుండి 9వరకు దురాజ్ పల్లి పెద్దగట్టు మహాజాతరకు 15 లక్షల మంది వస్తారని […]

  • Publish Date - December 24, 2022 / 01:06 PM IST
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జాతర

విధాత: రాష్టంలో రెండో అతి పెద్ద జాతరయిన దురాజ్ పల్లి పెద్ద గట్టు జాతర ఏర్పాట్లపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుండి 9వరకు దురాజ్ పల్లి పెద్దగట్టు మహాజాతరకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు.

వచ్చే ప్రతీ భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది రానున్న నేపథ్యంలో జాతీయ రహదారి పై ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కు మంత్రి సూచించారు. అదే విధంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగు నీరు సమస్య రాకుండా మిషన్ కాకతీయ ద్వారా సరిపడా నీటిని అందించాలని ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టంగా పారిశుద్ధ్య నిర్వహణను చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు. లైటింగ్ , మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు కల్పించాలని, భక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదని మంత్రి అధికారులను కోరారు. ఇక ఇక్కడికి వచ్చే భక్తులు ఒక రోజు మొత్తం ఉండే సంప్రదాయం ఉండటంతో రైతులకు పంట పరిహారం అందజేసి 150 ఎకరాలు సేకరించామని మంత్రి అన్నారు.

గతం లో నీరు లేక గట్టు పరిసర భూములు బీడు భూములు గా ఉండటం తో భక్తులు అందులో బస చేసే వారని, కానీ ప్రస్తుతం కాళేశ్వరం జలాలు వస్తుండటంతో పెద్ద గట్టు పరిసరాలు పంట పొలాలు గా మారిపోయిన నేపథ్యం లో భక్తుల సౌకర్యం కోసం రైతులను ఒప్పించి 150 ఎకరాలను సేకరించడం జరిగిందన్నారు.

సమీక్ష సమావేశం లో ఎంపి బడుగుల, పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది భిక్షం, చివ్వెంల వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, ఉప్పల ఆనంద్, స్థానిక కౌన్సిలర్ లక్ష్మి మకథ్ లాల్, బాషా మియా తదితరుల పాల్గొన్నారు.