Road Accident
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కుందారం కెనాల్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టింది.
ఈ వాహనంలో ఐదుగురు ప్రయాణికులు ప్రయాణిస్తుండగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందారు.
భద్రాద్రి జిల్లా పాల్వంచ నుంచి హైదరాబాదుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.