Road Accident
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్కు చెందిన ఆరుగురు విద్యార్థులు కారులో గురువారం ఉదయం తెల్లవారుజామున వరంగల్ వైపు వస్తుండగా జంగాలపల్లి క్రాస్ వద్ద వారు ప్రయాణిస్తున్న కారు (స్విఫ్ట్ డిజైర్) ఒకసారి అదుపుతప్పి పశువుల సంత ముందున్న డివైడర్ను తర్వాత స్ట్రీట్ లైట్ స్థంభాన్ని ఢీ కొట్టి ఫల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న ములుగు సిఐ,ఎస్ఐలు గాయపడిన వారిని 108 ద్వారా ములుగు ఏరియా హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం, అతివేగం ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.