Suryapet
విధాత: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో నీటి కుంటలో పడి ఇద్దరు బాలురు దుర్మరణం చెందారు. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు బాలురు వినయ్(12), ఉపేందర్(13)లు నీటి కుంటలో మునిగి చనిపోయారు.
స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. బాలుర కుటుంబ సభ్యులు తమ పిల్లల మృతి పట్ల తీవ్ర విషాదంలో మునిగారు.