23మంది ఐపీఎస్‌ల బదిలీలు

ప్రభుత్వం బుధవారం రోజునే 26 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఇదే రోజు 23మంది ఐపీఎస్‌లను సైతం బదిలీ చేసి పాలనలోతన మార్కును చూపే ప్రయత్నంలో మరో ముందడుగు

  • Publish Date - January 3, 2024 / 03:24 PM IST

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

విధాత : తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం బుధవారం రోజునే 26 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఇదే రోజు 23మంది ఐపీఎస్‌లను సైతం బదిలీ చేసి పాలనలోతన మార్కును చూపే ప్రయత్నంలో మరో ముందడుగు వేసింది. బదిలీ కాబడిన ఐపీఎస్‌లలో సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. పోలీసుల నియామక బోర్డు చైర్మన్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.


కోఆర్డినేషన్‌ డీఐజీగా గజరావు భూపాల్‌, మహిళా భద్రతా విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రామగుండం పోలీస్‌ కమిషనర్‌గా ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఎల్బీనగర్‌ డీసీపీగా సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌, టీఎస్‌ ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌రెడ్డి, మాదాపూర్‌ డీసీపీగా జీ. వినత్‌ను నియమించింది. రాజేంద్రనగర్‌ డీసీపీగా సీహెచ్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-3గా ఆర్‌ వెంకటేశ్వర్లు,జోగులాంబ డీఐజీగా జోయల్‌ డేవిస్‌, విష్ణు వారియర్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది.


పీవీ పద్మజను మల్కాజ్‌గిరి డీసీపీగా, నిర్మల్‌ ఎస్పీగా జీ. జానకీ షర్మిల, జానకీ ధరావత్‌ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా, ఖమ్మం సీపీగా సునీల్‌దత్‌, సీఐడీ ఎస్పీగా ఎస్‌ రాజేంద్ర ప్రసాద్‌ బదిలీ అయ్యారు. ఆదిలాబాద్‌ ఎస్పీగా గౌష్‌ ఆలం, ములుగు ఎస్పీగా శబరీష్‌, మేడ్చల్‌ డీసీపీగా నిఖితా పంత్‌, సిద్దిపేట సీపీగా బీ. అనురాధ, ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీగా సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బిరుదురాజు రోహిత్‌ రాజు, మెదక్‌ ఎస్పీగా బీ. బాలస్వామి, భయశంకర్‌భూపాలపల్లి ఓఎస్డీగా అశోక్‌కుమార్‌, రాజేంద్రనగర్‌ జోన్‌ డీసీపీగా ఆర్‌. వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News