విధాత:దసరా పండుగ పర్వదినాన్ని చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇక శ్రీరాముడు రావణాసురుడిని వధించిన దానికి గుర్తుగా.. దసరా రోజు రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అందరికీ తెలిసిందే.
అయితే ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో విజయ దశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వం ఇంటర్ కళాశాల మైదానంలో రావణాసురుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రావణుడికి కోపం వచ్చిందేమో తెలియదు కానీ.. ఒక్కసారిగా జనాలపై నిప్పుల వర్షం కురిపించాడు.
ఒకట్రెండు సార్లు జనాలపైకి నిప్పులు ఎగిరిపడ్డాయి. దీంతో అక్కడికి వచ్చిన వారంతా ఆ అగ్నికీలల నుంచి కాపాడుకునేందుకు వెనక్కి పరుగెత్తారు. పోలీసులు కూడా పరుగెత్తి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
Latest News
మైండ్ బ్లోయింగ్ ఫొటోగ్రఫీ ఫీచర్లతో ఒప్పో ఫ్లాగ్షిప్.. ఫొటోగ్రఫీ లవర్స్కి ఇక పండగే..!
పొద్దున్నే పెళ్లి.. మధ్యాహ్నమే డ్యూటీ.. గొప్పగా చెప్పుకున్న సీఈవోను ఏకిపారేసిన నెటిజన్లు
ములుగు జిల్లాలో "మన ఇసుక వాహనం".. అక్రమ రవాణాపై ఉక్కు పాదం.. పంపిణీలో పారదర్శకత
తెలంగాణలో డిజిటల్ జనగణనకు శ్రీకారం.. మే 11 నుంచి తొలి దశ
వరంగల్ కేఏంసీలో ర్యాగింగ్ కలకలం.. చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు
ఆంటీ అని పిలిచినందుకు కోర్టుకెక్కిన మహిళ.. రూ.1.8 లక్షల ఫైన్ విధిస్తూ తీర్పు
సినిమా కాదు..నీళ్లలో జరజర పాకుతూ గ్రీన్ అనకొండ హల్చల్ !
అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్
ఏప్రిల్ పది నుంచి రహదారులపై ప్రయాణానికి కొత్త రూల్స్..
నాగిని ఇదే..స్నేక్ డ్యాన్స్ చూసేయండి !