విధాత:దసరా పండుగ పర్వదినాన్ని చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇక శ్రీరాముడు రావణాసురుడిని వధించిన దానికి గుర్తుగా.. దసరా రోజు రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అందరికీ తెలిసిందే.
అయితే ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో విజయ దశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వం ఇంటర్ కళాశాల మైదానంలో రావణాసురుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రావణుడికి కోపం వచ్చిందేమో తెలియదు కానీ.. ఒక్కసారిగా జనాలపై నిప్పుల వర్షం కురిపించాడు.
ఒకట్రెండు సార్లు జనాలపైకి నిప్పులు ఎగిరిపడ్డాయి. దీంతో అక్కడికి వచ్చిన వారంతా ఆ అగ్నికీలల నుంచి కాపాడుకునేందుకు వెనక్కి పరుగెత్తారు. పోలీసులు కూడా పరుగెత్తి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
Latest News
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!
స్థిరంగా బంగారం, వెండి ధరలు