Site icon vidhaatha

Karimnagar | బస్సును ఢీకొన్న ట్రాక్టర్.. పది మందికి గాయాలు

Karimnagar |

రోడ్డు పక్కకు పడిపోయిన బస్సు

విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల శివారులో ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

వారిని స్థానికులు, పోలీసులు వాహనాలలో అంబులెన్స్ లలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

బస్సు ఇల్లంతకుంట నుండి వల్లంపట్ల మీదుగా సిరిసిల్ల వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ సంఘటన స్థలంలో ఉండి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version