Warangal | కేటీఆర్‌కు.. డంప్‌యార్డ్‌ చెత్త తోరణాల స్వాగతం.. కాంగ్రెస్ వినూత్న నిరసన

Warangal మడికొండ తో సహా ప్రజల అవస్థలు విఫలమైన బయోమైనింగ్ వ్యవస్థ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లా మడికొండ ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని శనివారం వరంగల్ జిల్లా కు మంత్రి కేటీఆర్ వస్తున్నందున శనివారం మడికొండ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడూ బక్క జడ్సన్ మడికొండ డంప్ యార్డ్ చెత్తతో తోరణాలు కట్టి నిరసన తెలియజేశారు. మడికొండ డంప్ యార్డ్ సమస్య వెంటనే పరిష్కారించాలని మడికొండ డంపు […]

  • Publish Date - June 16, 2023 / 01:04 AM IST

Warangal

  • మడికొండ తో సహా ప్రజల అవస్థలు
  • విఫలమైన బయోమైనింగ్ వ్యవస్థ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లా మడికొండ ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని శనివారం వరంగల్ జిల్లా కు మంత్రి కేటీఆర్ వస్తున్నందున శనివారం మడికొండ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడూ బక్క జడ్సన్ మడికొండ డంప్ యార్డ్ చెత్తతో తోరణాలు కట్టి నిరసన తెలియజేశారు.

మడికొండ డంప్ యార్డ్ సమస్య వెంటనే పరిష్కారించాలని మడికొండ డంపు యార్డ్ వల్ల ప్రజలకు క్యాన్సర్ వ్యాధి మరియు ప్రాణాంతక శ్వాస కోశ వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తూ ప్రాణ నష్టాలు జరుగుతున్న ప్రభుత్వం, మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బక్క జడ్సన్ ఆరోపించారు.

ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు..

వరంగల్ త్రినగరం ను స్మార్ట్ సిటీ, క్లీన్ సిటీ, డ్రీం సిటీ చేస్తా అన్న కేటీర్ GWMC వరంగల్ ను పొల్యూషన్ సిటీ, స్మోక్ సిటీగా మార్చా డని KTR ఏం మొఖం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారని బక్క జడ్సన్ అన్నారు. హనుమకొండ జిల్లా మడికొండలో 2013లో వరంగల్ నగరంలోని చెత్తను మడికొండలో వేసేందుకు సుమారు 33 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డ్ ను వరంగల్ నగర కార్పొరేషన్ వారు ఏర్పాటు చేశారు.

నగరంలోని అన్ని డివిజన్లలో సేకరించిన చెత్తను ఈ డంపింగ్ యార్డ్ లోనే వేసి నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా గుట్టలుగా పేరుకుపోయింద‌న్నారు. సంబంధిత మున్సిపల్ శాఖ మరియు జిల్లా అధికార యంత్రంగాం నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమే నాటి నుండి నేటి వరకు సమస్య పూర్తి పరిష్కారానికి నోచుకోలేదని బక్క జడ్సన్ అన్నారు.

అనేక గ్రామాల ప్రజల అవస్థలు

మడికొండ ప్రజలు నిరంతరం ఈ డంపింగ్ యార్డ్ వల్ల అన్ని గ్రామాల కంటే ముందుగా అనారోగ్యానికి గురవుతున్నారని చుట్టుపక్కల గ్రామాలైనటువంటి ధర్మసాగర్ ఎల్కుర్తి, పెద్ద పెండ్యాల, తరాలపల్లి, టేకులగూడెం, బట్టుపల్లి, రామ్ పేట, అయోధ్య పురం, కుమ్మరిగూడెం, కాజీపేట పట్టణం, ఫాతిమా నగర్, దర్గా తదితర ప్రాంతాలంతా రాత్రి 11 తరువాత పూర్తిగా పొగ మంచుతో కమ్ముకపోయి శ్వాస తీసుకోవడానికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జడ్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.

విఫలమైన బయోమైనింగ్

2020 లో సుమారు 36 కోట్ల వ్యయంతో బయో మైనింగ్ ఏర్పాటు చేసి పూర్తిగా సమస్య పరిష్కారం చేస్తామని ప్రక్రియను మొదలుపెట్టారని నేటి వరకు ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని బక్క జడ్సన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ నాయకులు మహమ్మద్ అంకుస్, బొడ్డు అనిల్, తుల రవి,ఎల్లా గౌడ్, చల్ల తిరుపతి స్వచ్చంద సంస్థ నాయకులు కొలిపాక ప్రకాష్, గ్యాధల సుదర్శన్, వక్కల కుమార్ తదితరులు పాల్గొన్నారు.