విధాత: అనుమతి లేకుండా అక్రమంగా డ్రోన్ల సహాయంతో యాదాద్రి దేవస్థానాన్ని చిత్రీకరిస్తున్న ఇద్దరినీ యాదగిరిగుట్ట ఎస్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ జీడిమెట్ల కు చెందిన ఇద్దరు యువకులు సాయికిరణ్, జాన్ మోసెస్ లు అనుమతి లేకుండా ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.