విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు బంగారు కిరీటాలు, వెండి పళ్లెం బహుకరించారు.
ఎం.ప్రకాష్ ముదిరాజ్ – సచితలు గురువారం ఆలయం నందు సువర్ణ పుష్పార్చన మూర్తులకు 0-429-000 గ్రాముల బంగారు కిరీటాలు, 0-520-00 గ్రాముల వెండి పళ్లెం విరాళంగా సమర్పించారు.
వాటిని ప్రత్యేక పూజల అనంతరం ఈవో గీతారెడ్డి గీతా, ప్రధానార్చకులు నందింగల్ లక్ష్మీ నరసింహ చార్యులకు అందించారు.