రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) జవాన్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఈ పేలుడు చోటు చేసుకున్నది. సిల్గెర్, టేకులగూడెం గ్రామాల మధ్య తిమ్మాపురం ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో కోబ్రా దళాలు ప్రయాణిస్తున్న ట్రక్పై నక్సలైట్లు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం రాజధాని రాయ్పూర్కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మోటర్ బైకులు, ట్రక్కులో 201 కోబ్రా బెటాలియన్ దళాలు వెళుతున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకున్నదని చెప్పారు. ట్రక్కును నడుపుతున్న జవాన్తోపాటు.. ఆయనకు అసిస్టెంట్గా ఉన్న మరో జవాను ఈ పేలుడులో చనిపోయారని బస్తర్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన పేర్కొంటున్నది. మృతులను కానిస్టేబుల్ శైలేంద్ర (29), వాహన డ్రైవర్ విష్ణు ఆర్ (35)గా గుర్తించారు. టేకులగూడెం వరకూ రోడ్ ఓపెనింగ్ పార్టీ విధుల్లో 201 కోబ్రా బెటాలియన్ వెళుతున్నదని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన విషయం తెలియగానే అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి.
ఛత్తీస్గఢ్లో పేలిన మందుపాతర … ఇద్దరు కోబ్రా జవాన్ల మృతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) జవాన్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు

Latest News
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయంపై మెగాస్టార్ భావోద్వేగ స్పందన
చిలకపచ్చ చీరలో కేక పెట్టిస్తున్న మాళవిక మోహనన్
చీరకట్టులో హీట్ పెంచిన నిధి అగర్వాల్
ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం
ఇది బ్లాక్బస్టర్ కాదు… ‘బాస్బస్టర్’! – అల్లు అర్జున్
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది : ఈనెల 24న లేదా 27న
రాత్రి బెడ్లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?