Lok Sabha | చైనా గత ఆరు దశాబ్దాల్లో 38,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించిందని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ శుక్రవారం లోక్సభలో చెప్పారు. అంతేగాక పాకిస్తాన్ తన ఆక్రమణలో ఉన్న 5180 చదరపు కిలోమీటర్ల శక్గాం వ్యాలీని 1963లో చైనాకు స్వాధీనం చేసిందని కూడా ఆయన చెప్పారు. చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ శక్గాం వ్యాలీని చైనాకు అప్పగించిందని, ఈ ఒప్పందాన్ని భారత్ అంగీకరించలేదని ఆయన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. జమ్ము కశ్మీర్, లద్దాఖ్లలోని భూభాగం భారత్లో విడదీయలేని భాగమని రెండు దేశాలకు భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తున్నదని మురళీధరన్ చెప్పారు. చైనా పాంగాంగ్ సరస్సుపై ఒక వంతెన నిర్మిస్తున్న విషయం తమ దృష్టిలో ఉందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1962 నుంచి చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలోనే వంతెన నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. చైనాతో దౌత్యపరంగాను, సైనిక పరంగానూ చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
Lok Sabha | ఆరు దశాబ్దాల్లో చైనా ఆక్రమించిన భారత భూభాగం ఎంతో తెలుసా?
Lok Sabha | చైనా గత ఆరు దశాబ్దాల్లో 38,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించిందని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ శుక్రవారం లోక్సభలో చెప్పారు. అంతేగాక పాకిస్తాన్ తన ఆక్రమణలో ఉన్న 5180 చదరపు కిలోమీటర్ల శక్గాం వ్యాలీని 1963లో చైనాకు స్వాధీనం చేసిందని కూడా ఆయన చెప్పారు. చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ శక్గాం వ్యాలీని చైనాకు అప్పగించిందని, ఈ ఒప్పందాన్ని భారత్ అంగీకరించలేదని ఆయన ఒక […]

Latest News
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్