Lok Sabha | చైనా గత ఆరు దశాబ్దాల్లో 38,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించిందని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ శుక్రవారం లోక్సభలో చెప్పారు. అంతేగాక పాకిస్తాన్ తన ఆక్రమణలో ఉన్న 5180 చదరపు కిలోమీటర్ల శక్గాం వ్యాలీని 1963లో చైనాకు స్వాధీనం చేసిందని కూడా ఆయన చెప్పారు. చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ శక్గాం వ్యాలీని చైనాకు అప్పగించిందని, ఈ ఒప్పందాన్ని భారత్ అంగీకరించలేదని ఆయన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. జమ్ము కశ్మీర్, లద్దాఖ్లలోని భూభాగం భారత్లో విడదీయలేని భాగమని రెండు దేశాలకు భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తున్నదని మురళీధరన్ చెప్పారు. చైనా పాంగాంగ్ సరస్సుపై ఒక వంతెన నిర్మిస్తున్న విషయం తమ దృష్టిలో ఉందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1962 నుంచి చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలోనే వంతెన నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. చైనాతో దౌత్యపరంగాను, సైనిక పరంగానూ చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
Lok Sabha | ఆరు దశాబ్దాల్లో చైనా ఆక్రమించిన భారత భూభాగం ఎంతో తెలుసా?
Lok Sabha | చైనా గత ఆరు దశాబ్దాల్లో 38,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించిందని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ శుక్రవారం లోక్సభలో చెప్పారు. అంతేగాక పాకిస్తాన్ తన ఆక్రమణలో ఉన్న 5180 చదరపు కిలోమీటర్ల శక్గాం వ్యాలీని 1963లో చైనాకు స్వాధీనం చేసిందని కూడా ఆయన చెప్పారు. చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ శక్గాం వ్యాలీని చైనాకు అప్పగించిందని, ఈ ఒప్పందాన్ని భారత్ అంగీకరించలేదని ఆయన ఒక […]

Latest News
‘పెద్ది’ పై రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ ..
అనిల్ రావిపూడి స్పీడ్కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది