న్యూఢిల్లీ : దేశ వర్షాకాల సీజన్ ప్రారంభాన్ని సూచిస్తూ నైరుతి రుతుపవనం మే 30, 2024న కేరళ తీరాన్ని తాకింది. అదే రోజు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాస్తవానికి జూన్ 1న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ రెండు రోజులు ముందుగానే ప్రవేశించడం విశేషం. గత ఏడాది జూన్ 8న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రుతుపవన సీజన్ (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)లో మధ్య భారతదేశం, దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, వాయవ్య భారతదేశంలో సాధారణ వర్షపాతం, సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే.. జూన్ 5, 12 తేదీల మధ్య రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Southwest monsoon | కేరళను తాకిన నైరుతి.. ఐదు నుంచి వారం రోజుల్లో తెలంగాణలోకి
దేశ వర్షాకాల సీజన్ ప్రారంభాన్ని సూచిస్తూ నైరుతి రుతుపవనం మే 30, 2024న కేరళ తీరాన్ని తాకింది. అదే రోజు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.

Latest News
డిప్రెషన్తో బాధపడుతున్నారా..? ఈ సమస్యకు వ్యాయామంతో చెక్ పెట్టండి
దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్
తెలుగు శబ్ధమే అతి ప్రాచీనమైనది
గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి టైమ్ వచ్చేసింది: ట్రంప్ సంచలన పోస్టు
రూ.7 చోరీ కేసు.. 50 ఏళ్ల తర్వాత తుది తీర్పు.. ఇప్పటికీ దొరకని దొంగల ఆచూకీ..!
మూడు లగ్జరీ ఇళ్లు, కారు, వడ్డీ వ్యాపారాలు.. రూ.కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు.. విలాసాలు చూస్తే షాకే
వెండి ధర కొత్త రికార్డు..పెరిగిన బంగారం ధరలు
సంక్రాంతి 2026 బాక్సాఫీస్ విజేతలు యువ హీరోలే..
‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ కంబ్యాక్పై అంచనాలు..
పూజా హెగ్డే సంచలన ఆరోపణలు..