న్యూఢిల్లీ : దేశ వర్షాకాల సీజన్ ప్రారంభాన్ని సూచిస్తూ నైరుతి రుతుపవనం మే 30, 2024న కేరళ తీరాన్ని తాకింది. అదే రోజు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాస్తవానికి జూన్ 1న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ రెండు రోజులు ముందుగానే ప్రవేశించడం విశేషం. గత ఏడాది జూన్ 8న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రుతుపవన సీజన్ (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)లో మధ్య భారతదేశం, దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, వాయవ్య భారతదేశంలో సాధారణ వర్షపాతం, సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే.. జూన్ 5, 12 తేదీల మధ్య రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Southwest monsoon | కేరళను తాకిన నైరుతి.. ఐదు నుంచి వారం రోజుల్లో తెలంగాణలోకి
దేశ వర్షాకాల సీజన్ ప్రారంభాన్ని సూచిస్తూ నైరుతి రుతుపవనం మే 30, 2024న కేరళ తీరాన్ని తాకింది. అదే రోజు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.

Latest News
లైవ్ అప్డేట్స్: అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు – బాలికల పాఠశాలలో 53 మంది మృతి
శ్రీముఖి ఏముంది మావా.. పొట్టి గౌన్ లో కిరాక్ ఫోజులు
స్థానికులకు ఉద్యోగమివ్వకుంటే ప్రారంభాన్ని అడ్డుకుంటాం : హరీష్ రావు
ప్రైవేట్ పార్టీలో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి.. వైరల్ అవుతోన్న పిక్స్
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు..24మంది విద్యార్ధుల మృతి
తొలిసారిగా రంజీ ట్రోపీ విజేతగా జమ్మూ కశ్మీర్ చారిత్రాక విజయం
వీకెండ్లో ఓటీటీలో సందడే సందడి..
వేట్లపాలెంలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18మంది మృతి !
రాజ్యసభకు తొలిసారిగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వ్యక్తి!
శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ !