న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమించి తమ దేశ జలాల్లోకి ప్రవేశించారన్నఆరోపణలతో అరెస్ట్ అయిన జాలర్లను విడిపించాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు లేఖ రాశారు. శ్రీలంక నేవీ అరెస్టు చేసిన తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను, వారి పడవలను విడిపించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్లోని మన్నార్ సమీపంలో జాలర్లను అరెస్ట్ చేయడంతో పాటు వారి మర పడవలను శ్రీలంక నేవీ స్వాధీనం చేసుకుందని స్టాలిన్ తెలిపారు. ప్రస్తుతం శ్రీలంక చెరలో 68 మంది భారత జాలర్లు, 235 పడవలు ఉన్నాయని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. వెంటనే జాలర్లను, వారి పడవలను తక్షణమే విడిపించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
జాలర్లను విడిపించండి..విదేశాంగ మంత్రికి స్టాలిన్ లేఖ
అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమించి తమ దేశ జలాల్లోకి ప్రవేశించారన్నఆరోపణలతో అరెస్ట్ అయిన జాలర్లను విడిపించాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు లేఖ రాశారు.

Latest News
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...త్వరలో కేసీఆర్ కు నోటీసులు?
కోటప్పకొండలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ..
మరో చరిత్ర సృష్టించబోతున్న భారత నారీ..గణతంత్ర వేడుకలే వేదిక!
వైట్కాలర్ ఉద్యోగాలకు ఏఐ ముప్పు.. హెచ్చరించిన బిల్ గేట్స్
మేడారం జాతరలో తులాభారం వివాదం..
‘వెల్కమ్ టు రాజస్థాన్’.. షకీరా వాకా వాకా పాటను ప్రత్యేక వెర్షన్లో పాడిన జానపద కళాకారులు.. ఆకట్టుకుంటున్న వీడియో
జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్..10మంది మావోయిస్టులు మృతి
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
సక్సెస్ ట్రాక్లో దూసుకెళుతున్న అనిల్ రావిపూడి..
జనవరి 26న ఆ ముఖ్యమంత్రిని చంపేస్తాం..!