న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమించి తమ దేశ జలాల్లోకి ప్రవేశించారన్నఆరోపణలతో అరెస్ట్ అయిన జాలర్లను విడిపించాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు లేఖ రాశారు. శ్రీలంక నేవీ అరెస్టు చేసిన తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను, వారి పడవలను విడిపించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్లోని మన్నార్ సమీపంలో జాలర్లను అరెస్ట్ చేయడంతో పాటు వారి మర పడవలను శ్రీలంక నేవీ స్వాధీనం చేసుకుందని స్టాలిన్ తెలిపారు. ప్రస్తుతం శ్రీలంక చెరలో 68 మంది భారత జాలర్లు, 235 పడవలు ఉన్నాయని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. వెంటనే జాలర్లను, వారి పడవలను తక్షణమే విడిపించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
జాలర్లను విడిపించండి..విదేశాంగ మంత్రికి స్టాలిన్ లేఖ
అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమించి తమ దేశ జలాల్లోకి ప్రవేశించారన్నఆరోపణలతో అరెస్ట్ అయిన జాలర్లను విడిపించాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు లేఖ రాశారు.

Latest News
ఆస్కార్స్ 2026 ప్రారంభం..
హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్.. ఐఆర్సీటీసీ కొత్త ట్రావెల్ ప్యాకేజీ
గుడ్న్యూస్: తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు చిరుజల్లులు
కాంగ్రెస్ను వీడి కారెక్కనున్న జగిత్యాల జీవన్రెడ్డి?
నెలకు 85 వేల ఇచ్చి నా భర్తను నువ్వే ఉంచుకో.. ప్రియురాలికి షాకింగ్ ఆఫర్ ఇచ్చిన భార్య
5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఈవీ కారు.. ఆటోమొబైల్ రంగంలో సంచలనం
వైరల్ అవ్వాలని రీల్.. యువతికి కోతి ఇచ్చిన షాక్ చూడండి!
వాట్సాప్లో భారీ అప్డేట్.. కొత్తగా మెటా ఏఐ ట్యాబ్, పేరెంట్స్ కోసం స్పెషల్ ఫీచర్!
జనపథంలో పీపుల్స్ మార్చ్.. ప్రజాపాలనలో భట్టి అడుగుజాడలు..!
ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల