చెబుతానన్న యోగా గురు, బాలకృష్ణ
న్యూఢిల్లీ : బాబా రాందేవ్, పతాంజలి సంస్థ ఎమ్ డి బాలకృష్ణపై మంగళవారం సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంత జరిగిన తరువాత మిమ్ములను వదిలేది లేదని హెచ్చరించింది. చేసిన తప్పులను అంగీకరిస్తూ వారం రోజులలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. పతాంజలి కంపెనీ గతంలో జారీ చేసిన వాణిజ్య ప్రకటనలు అలోపతి వైద్యాన్ని తీవ్రంగా విమర్శించాయి. తమ కంపెనీ తయారు చేసిన కరోనిల్ కొవిడ్ వైరస్కు తగిన నివారిణిగా ప్రచారం చేసుకుంది. ఇటువంటి ప్రకటనలు జారీ చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చి, దానిని ఉల్లంఘించిన కేసులో ఇప్పటికే క్షమాపణలకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణకు బాబా రాందేవ్, బాలకృష్ణ హాజరైనారు. తాము బహిరంగ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.
వారంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు హెచ్చరిక
బాబా రాందేవ్, పతాంజలి సంస్థ ఎమ్ డి బాలకృష్ణపై మంగళవారం సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంత జరిగిన తరువాత మిమ్ములను వదిలేది లేదని హెచ్చరించింది

Latest News
ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. వైరల్ వీడియో
బాలుడిని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
పానీపూరీ ఎఫెక్ట్… చిన్నారులకు అస్వస్థత
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్
రైతుల ఖాతాల్లోకి ఈ నెలలోనే రైతు భరోసా నిధులు
స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
రైతులకు గుడ్ న్యూస్..జూన్ 20న ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
హామీలు అమలుచేయకుంటే తిరుగుబాటు తప్పదు : కాంగ్రెస్ సర్కారుకు సీపీఐ నేత కూనంనేని హెచ్చరిక
ఇంజెక్షన్లకు ఇక గుడ్బై? మధుమేహం చికిత్సకు కొత్త ఔషధంతో కొత్త ఆశలు