చెబుతానన్న యోగా గురు, బాలకృష్ణ
న్యూఢిల్లీ : బాబా రాందేవ్, పతాంజలి సంస్థ ఎమ్ డి బాలకృష్ణపై మంగళవారం సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంత జరిగిన తరువాత మిమ్ములను వదిలేది లేదని హెచ్చరించింది. చేసిన తప్పులను అంగీకరిస్తూ వారం రోజులలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. పతాంజలి కంపెనీ గతంలో జారీ చేసిన వాణిజ్య ప్రకటనలు అలోపతి వైద్యాన్ని తీవ్రంగా విమర్శించాయి. తమ కంపెనీ తయారు చేసిన కరోనిల్ కొవిడ్ వైరస్కు తగిన నివారిణిగా ప్రచారం చేసుకుంది. ఇటువంటి ప్రకటనలు జారీ చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చి, దానిని ఉల్లంఘించిన కేసులో ఇప్పటికే క్షమాపణలకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణకు బాబా రాందేవ్, బాలకృష్ణ హాజరైనారు. తాము బహిరంగ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.
వారంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు హెచ్చరిక
బాబా రాందేవ్, పతాంజలి సంస్థ ఎమ్ డి బాలకృష్ణపై మంగళవారం సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంత జరిగిన తరువాత మిమ్ములను వదిలేది లేదని హెచ్చరించింది

Latest News
ఎగ్జిట్ పోల్స్ 2026: బెంగాల్లో బీజేపీ ఆధిక్యం? అస్సాంలో హ్యాట్రిక్ సంకేతాలు..
స్పోర్టీ లుక్తో సరికొత్త మినీ కూపర్.. ధర ఎంతంటే..!
200మెగాపిక్సెల్ కెమెరాతో మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ రాబోతుందా.. స్పెసిఫికేషన్లు లీక్!
90 ఏళ్ల బామ్మ మొండిపట్టు.. పరువు నష్టం కేసు విచారణ 20 ఏళ్లకి వాయిదా!
ట్రాన్స్జెండర్లు శుభకార్యాలకు వచ్చి డబ్బులు అడిగే హక్కు లేదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
ప్లాస్టిక్ బెలూన్లలో వంట గ్యాస్ నింపుకుంటున్న పాక్ ప్రజలు.. మొబైల్ బాంబ్గా మారిపోతున్న ఇళ్లు
హైదరాబాద్ మెట్రో రైల్ తెలంగాణ ప్రభుత్వ పరం.. ఎల్అండ్టీతో ఒప్పందం పూర్తి
సింగిల్ బెడ్రూం ప్లాట్ కూడా కొనలేని మాకు పిల్లలు అవసరమా? ఆలోచనలో పడేస్తున్న యువ దంపతుల నిర్ణయం
మోదీ పాచికలు పారనివ్వని బెంగాల్.. అధికారం మళ్లీ తృణమూల్దే: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా
కేరళంలో కమ్యూనిస్టులకు షాక్? యూడీఎఫ్దే ఆధిక్యమన్న పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్