చెబుతానన్న యోగా గురు, బాలకృష్ణ
న్యూఢిల్లీ : బాబా రాందేవ్, పతాంజలి సంస్థ ఎమ్ డి బాలకృష్ణపై మంగళవారం సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంత జరిగిన తరువాత మిమ్ములను వదిలేది లేదని హెచ్చరించింది. చేసిన తప్పులను అంగీకరిస్తూ వారం రోజులలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. పతాంజలి కంపెనీ గతంలో జారీ చేసిన వాణిజ్య ప్రకటనలు అలోపతి వైద్యాన్ని తీవ్రంగా విమర్శించాయి. తమ కంపెనీ తయారు చేసిన కరోనిల్ కొవిడ్ వైరస్కు తగిన నివారిణిగా ప్రచారం చేసుకుంది. ఇటువంటి ప్రకటనలు జారీ చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చి, దానిని ఉల్లంఘించిన కేసులో ఇప్పటికే క్షమాపణలకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణకు బాబా రాందేవ్, బాలకృష్ణ హాజరైనారు. తాము బహిరంగ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.
వారంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు హెచ్చరిక
బాబా రాందేవ్, పతాంజలి సంస్థ ఎమ్ డి బాలకృష్ణపై మంగళవారం సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంత జరిగిన తరువాత మిమ్ములను వదిలేది లేదని హెచ్చరించింది

Latest News
Padma Awards 2026 | పద్మ అవార్డులు 2026: తెలుగు తేజాలకు ఘన గౌరవం
3వ టీ20లోనూ భారత్దే ఆధిపత్యం : సిరీస్ కైవసం
పిల్లల కోసం షావుమీ ప్రత్యేక స్మార్ట్ వాచ్ : తల్లిదండ్రులకు భరోసా
రిపబ్లిక్ డేకి వాట్సప్ స్టిక్కర్లు వాట్సప్లోనే తయారుచేసుకోండి
మేడారం స్పెషల్ ... ఇప్పపువ్వు లడ్డు
గజదొంగకు ముగ్గురు స్టువర్టుపురం దొంగల తోడు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్-బెంగళూరు హైవే – యాక్సెస్ కంట్రోల్డ్గా మార్పుతో 5 గంటల్లో బెంగళూరు
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..45మందిలో తెలంగాణ వాసి
యాదగిరిగుట్ట సమీపంలోకి పెద్దపులి రాక !
అనకొండ సినిమాను ఎలా తీశారో చూస్తారా!