నేరుగా సుప్రీంకు ఎలా వస్తారు?

న్యూ ఢిల్లీ : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌, వైద్య పరీక్షలపై సుప్రీంలో మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం నివేదికను సుప్రీం పరిశీలించింది. ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవు. గుజరాత్‌ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని […]

  • Publish Date - May 21, 2021 / 11:17 AM IST

న్యూ ఢిల్లీ : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌, వైద్య పరీక్షలపై సుప్రీంలో మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం నివేదికను సుప్రీం పరిశీలించింది. ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవు. గుజరాత్‌ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో ఎలా పిటిషన్‌ దాఖలు చేస్తారు?’’ అని దవే సుప్రీంకు తెలిపారు. ఆయన రెండు వర్గాలమధ్య రెచ్చగొట్టేలా మాట్లాడారని అన్నారు.

‘‘ఎంపీ రఘురామ హద్దులు మీరారు. కరోనావేళ ఇదంతా సరికాదని రఘురామకు సమయం ఇచ్చాం. సీఐడీ అధికారులు ఎంపీకి సంబంధించిన 45 వీడియోలు సేకరించి విచారణ చేశారు. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి సృష్టించేందుకు రఘురామ ప్రయత్నించారు. ఇవన్నీ రాజద్రోహం కిందికే వస్తాయి’’ అని దవే కోర్టుకు వెల్లడించారు. రఘురామకృష్ణరాజు ఎంపీ అని ముకుల్‌ రోహత్గీ పదేపదే చెబుతున్నారనీ, చట్టం అందరికీ ఒక్కటేనని దవే అన్నారు. ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్లు కాదన్నారు. హైకోర్టు బెయిల్‌ కోసం కింది కోర్టుకు వెళ్లమని చెప్పిందని, ఎంపీ అయినంత మాత్రాన బైపాస్‌లో నేరుగా సుప్రీం కోర్టుకు ఎలా వస్తారు? అని దవే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికపై నివేదికపై తాము అభ్యంతరం చెప్పడం లేదని, అదేసమయంలో జీజీహెచ్‌ ఆస్పత్రి నివేదిక కూడా సరైనదేనని దవే కోర్టుకు తెలిపారు. అలాగైతే ఎంపీ కాలికి ఫ్రాక్చర్‌ గురించి ఏం చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. సమయం ఎక్కువగా లేదని ధర్మాసనం గుర్తు చేయగా.. రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నందున విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. గుంటూరు జైలు నుంచి ఆర్మీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తామంటే ఎంపీ నిరాకరించారనీ, తన కారులో వెళ్తూ అభివాదం చేశారనీ, ఆ సమయంలో కాలిగాయాలు చూపించారనీ చెప్పారు.

అంతకుముందు రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. జగన్‌ బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ వేశారన్న నెపంతోనే ఆయనపై కక్షపెంచుకున్నారని కోర్టుకు తెలిపారు. జగన్‌ ప్రతివాదిగా లేనందున దీనిలోకి ఆయన్ను లాగొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే అన్నారు. పిటిషనర్‌గా తాను చెప్పాలనుకున్నది తాను చెబుతానని రోహత్గీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు న్యాయవాదులు ఎందుకు తగవులాడుకుంటున్నారని ధర్మాసనం మందలించింది.

బెయిల్‌ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారని రోహత్గీ ఆక్షేపించారు. అరెస్టు, మెజిస్ట్రేట్‌, హైకోర్టు విచారణ పరిణామాలను రోహత్గీ కోర్టుకు వివరించారు. అనంతరం ఆర్మీ ఆస్పత్రి వైద్య పరీక్షలను ఆయన ప్రస్తావించారు. కాలి బొటనవేలు పక్కన ప్రాక్చర్‌ అయ్యిందని వైద్యులు తెలిపారన్నారు. కేదార్‌నాథ్‌ తీర్పులో రాజద్రోహం పెట్టే కారణాలు వివరించారు. కానీ, ఈ సందర్భంలో రాజద్రోహం పెట్టిన కారణం పూర్తిగా బోగస్‌ అని రోహత్గీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Latest News