విధాత: టీఎస్ ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.. యూట్యూబ్ లో ప్రసారమవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు.
ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనే క వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ పేర్కొన్నా రు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
సజ్జనార్ మాట్లాడుతూ..
టిఎస్ఆర్టిసిని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యం , ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యో గులు సహించరు. వాస్తవానికి మెరుగైన, పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ నటించాలి.
టీఎస్ఆర్టీసి సామాన్యుల సేవలో ఉందని, అందుకే నటునికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు పంపుతున్నాం అల్లు అర్జున్ , ర్యాపిడ్ సంస్థలు ఆర్టీసికీ క్షమాపణలు చెప్పి వెంటనే యాడ్ అపకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతాం. అని చెప్పారు.