తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలి ..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు

:తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం హనుమకొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంపై తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.

  • Publish Date - June 2, 2024 / 07:24 PM IST

విధాత, వరంగల్ ప్రతినిధి:తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం హనుమకొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంపై తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సీపీఐ జిల్లా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. తొలుత హనుమకొండ అదాలత్ సెంటర్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ కోసం పోరాడిన పార్టీలను, సంఘాలను గుర్తించాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారులకు న్యాయం చేయాలని, ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం అమరులైన ఉద్యమ కారుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. గడిచిన పదేళ్లలో అప్పటి ప్రభుత్వం ఉద్యమ కారుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు కర్రె లక్ష్మణ్,వమునిగాల బిక్షపతి, వేల్పుల సారంగపాణి, జక్కు రాజు గౌడ్, కొట్టెపాక రవి, ఏశబోయిన శ్రీనివాస్, బాషబోయిన సంతోష్, కండె నర్సయ్య, బత్తిని సదానందం, పూర్ణ చందర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Latest News