విధాత, హైదరాబాద్:తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారుల పనితీరుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫిదా అయ్యారు. శనివారం ఫోన్లో పలువురి అధికారులను ఆయన అభినందించి ప్రోత్సహించారు. డిఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అంకితభావంతో కూడిన పనితీరు ను గవర్నరు తెలుసుకు న్నారు. 11 గిరిజన కుటుంబాలకు మందులు, దోమతెరలు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు ములుగు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అల్లెం అప్పయ్య 16 కిలోమీటర్లు కాలినడకన వాజేడు మండలంలోని మారుమూల గ్రామానికి వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకు ని ఎంతో సంతోషించిన గవర్నర్ డిఎంహెచ్ఓ తో ఫోన్లో మాట్లాడి, ఆయన విధినిర్వహణను కొనియాడారు. తన అనుభవాన్ని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ అప్పయ్య ఫోన్లో గవర్నర్ కు వివరించారు.
Bandaru Dattatreya | డీఎంహెచ్వో అల్లెం అయ్యప్ప అంకితభావానికి ముగ్దులైన బండారు దత్తాత్రేయ
తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారుల పనితీరుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫిదా అయ్యారు. శనివారం ఫోన్లో పలువురి అధికారులను ఆయన అభినందించి ప్రోత్సహించారు

Latest News
ఆరెంజ్ కలర్ ఔట్ఫిట్ లో మరింత గ్లామరస్ గా మృణాల్
వన జాతర నుంచి ఎన్నికల జాతరలోకి.. అంతా పరకాయ ప్రవేశం
నాజూకు నడుము అందాలతో ఆగం చేస్తున్న రకుల్ ప్రీత్
జోధ్పూర్ టు హైదరాబాద్.. పచ్చిమిర్చిలో డ్రగ్స్ స్మగ్లింగ్.. షాకింగ్ వీడియో
ఉద్యమకారులను అవమానించిందే కేసీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి
బైక్ షోరూమ్లోకి దూసుకెళ్లిన అడవి దున్న.. తర్వాత ఏమైందంటే..?
రెప్పపాటులో మృత్యువును తప్పించుకున్న చిన్నారి.. వీడియో వైరల్
కోఠి కాల్పుల కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు!
లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
కాంగ్రెస్ అభ్యర్థులకు రేపు బీ ఫామ్ ల పంపిణీ : సీఎం రేవంత్ రెడ్డి