విధాత, హైదరాబాద్ : తెలంగాణలో వెలుగుచూసిన జీఎస్టీ కుంభకోణాన్ని సీబీఐకి బదిలీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారించుకున్న పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఈ స్కామ్లో ఏ5గా రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పేరు పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలిసి జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్టు అంతర్గత ఆడిటింగ్లో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సీఐడీ నుంచి సీబీఐకి కేసును అప్పగించాలని రాజాసింగ్ అమిత్ షాను కోరారు.
Raja Singh | జీఎస్టీ స్కామ్పై సీబీఐ విచారణ చేపట్టాలి … కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
తెలంగాణలో వెలుగుచూసిన జీఎస్టీ కుంభకోణాన్ని సీబీఐకి బదిలీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు.

Latest News
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం
శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
ప్రస్టేషన్ తోనే కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు : మంత్రి వెంకట్ రెడ్డి
తెలంగాణ రాహు కేతువులు రేవంత్, కేసీఆర్ లు: బండి సంజయ్
చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీ బిగ్ అప్డేట్..