విధాత, హైదరాబాద్ : తెలంగాణలో వెలుగుచూసిన జీఎస్టీ కుంభకోణాన్ని సీబీఐకి బదిలీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారించుకున్న పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఈ స్కామ్లో ఏ5గా రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పేరు పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలిసి జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్టు అంతర్గత ఆడిటింగ్లో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సీఐడీ నుంచి సీబీఐకి కేసును అప్పగించాలని రాజాసింగ్ అమిత్ షాను కోరారు.
Raja Singh | జీఎస్టీ స్కామ్పై సీబీఐ విచారణ చేపట్టాలి … కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
తెలంగాణలో వెలుగుచూసిన జీఎస్టీ కుంభకోణాన్ని సీబీఐకి బదిలీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు