Site icon vidhaatha

Raja Singh | జీఎస్టీ స్కామ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలి … కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో వెలుగుచూసిన జీఎస్టీ కుంభకోణాన్ని సీబీఐకి బదిలీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారించుకున్న పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఈ స్కామ్‌లో ఏ5గా రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పేరు పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలిసి జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్టు అంతర్గత ఆడిటింగ్‌లో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సీఐడీ నుంచి సీబీఐకి కేసును అప్పగించాలని రాజాసింగ్ అమిత్ షాను కోరారు.

Exit mobile version