విధాత: గత నెల 27వ తేదీన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 47 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సిట్ విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ, టీవీకే పార్టీ నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ అధికారులు తమకు వ్యతిరేకంగా విచారణ జరుపుతున్నారని టీవీకే పార్టీ న్యాయవాదులు వాదించడంతో సుప్రీం కోర్టు ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై అన్ని పార్టీల అనుమానాలు తొలగాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని, అందువల్లే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ప్రతి నెల కేసు పురోగతిని కోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
CBI Probe On Karur Stampede | కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ
కరూర్ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం. అనుమానాలు తొలగాలంటే ఇది అవసరమని కోర్టు పేర్కొంది.

Latest News
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
తెలంగాణ ప్రజలకు తేజస్వీ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం
డీలిమిటేషన్ బిల్లుతో ఉత్తరాదికి ఆధిపత్యం... దేశంలో చీలిక : మేధావుల ఆందోళన
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వీ వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్ ఫైర్
రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దంగా ఉంది : మాజీ మంత్రి మోత్కుపల్లి
కొత్త పార్టీ సన్నాహాలు...కాశీలో కవిత పూజలు
దేశ చరిత్రలో మహిళ రిజర్వేషన్ బిల్లు కీలక ఘట్టం: ప్రధాని మోదీ
ఉద్యోగుల డిమాండ్లపై 17న తహశీల్దార్లకు వినతులు: లచ్చిరెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం మూర్ఖత్వం: ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్
సింగర్ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్