55నిమిషాల ఆలస్యంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌

  • Publish Date - December 24, 2023 / 05:43 AM IST

కొత్త రేష‌న్ కార్డులు, గృహ‌ల‌క్ష్మి, ధ‌ర‌ణి, కౌలు రైతుల‌కు రైతు భ‌రోసా తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉద‌యం 10 గంట‌ల‌కు స‌చివాల‌యంలోని వెస్ట‌ర్న్‌డోమ్‌లో నిర్వ‌హించేందుకు నిర్ణయించారు. దీంతో అధికారులు అంతా సచివాలయానికి చేరుకున్నారు. అయితే ఈ సమావేశానికి సీఎం రేవంత్ 55నిమిషాలు ఆలస్యంగా రావడంతో కార్యక్రమం దాదాపు గంట పాటు ఆలస్యం జరిగింది. కాగా ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు,వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు.