విధాత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేసి చూపించిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయాన్ని చేశారన్నారు. ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా చెల్లించకుండా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారని కానీ మోదీ సర్కారు మాత్రం తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదన్నారు. ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు ప్యాకేజీ ఇస్తే హర్షించదగ్గ పరిణామం కానీ తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపించారని ప్రశ్నించారు. పెన్షన్లు, ఆదాయపన్ను స్లాబ్ రేట్లు తూతు మంత్రంగా ప్రవేశపెట్టినా, నిత్యవసర ధరలు, గ్యాస్ ధరలు పెరుగుపోయిన తరుణంలో వాటికి ఉపశమన మార్గాలు చేయలేదన్నారు. తెలంగాణకు ఒక సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కూడా ఇవ్వలేదని, కనీసం నిధులు కేటాయించలేదని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పక తప్పదని చాడ హెచ్చరించారు.
Chada Venkat Reddy | కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు మొండి చే యి .. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేసి చూపించిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయాన్ని చేశారన్నారు.

Latest News
వద్దనుకుంటే పెట్రోల్ కొనొచ్చు.. కానీ అధిక ధర చెల్లించాలి
తెలంగాణలో సర్(SIR) గడువు పెంపు
మమత ముస్లిం రిజర్వేషన్లకు మంగళం
రామరావణులుగా మహేశ్ బాబు, తారక్ లు..ఏఐ రామాయణ ట్రైలర్ వైరల్ !
జయలలిత బంగ్లాను కొనుగోలు చేయనున్న సీఎం విజయ్ !?
సీఎం విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !
“తెలంగాణ రైజింగ్-2047” లక్ష్యం..ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి
సైకిల్పై కేదార్నాథ్ కు సాహస యాత్ర..తోడుగా కుక్క!
దేశ పురోగతి మార్గం..నదుల అనుసంధానం : సీఎం చంద్రబాబు
అమెరికాతో పీస్ డీల్ కు ఇరాన్ గుడ్ బై!