Site icon vidhaatha

రౌండ్ రౌండ్ కి పెరుగుతున్న‌ ఈటల ఆధిక్యం

విధాత‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 9వ రౌండ్‌ లెక్కింపు ముగిసేసరికి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఈ రౌండ్‌లో ఆయనకు 1,835 ఓట్ల ఆధిక్యం లభించింది. 8వ రౌండ్‌లో కాస్త వెనుకబడినట్లు ఈటల కనిపించినా 9వ రౌండ్‌కి వచ్చేసరికి మళ్లీ ఆయన పుంజుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన రౌండ్లలో ఈటలకు ఇదే భారీ ఆధిక్యం కావడం గమనార్హం.

Exit mobile version