విధాత : యూరియా సరఫరా చేయలేదనే ఆగ్రహంతో మహబూబాబాద్లోని గ్రోమోర్ సెంటర్ పై గురువారం రైతులు దాడికి దిగారు. ఈ సెంటర్ తలుపులు పగులగొట్టి యూరియాను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. యూరియా కోసం బుధవారమే తమ వద్ద నుంచి గ్రోమోర్ సెంటర్ సిబ్బంది ఆధార్ కార్డులు తీసుకుని గురువారం యూరియా ఇస్తామని చెప్పారని రైతులు అంటున్నారు. కానీ, గురువారం కూడా యూరియా సరఫరా చేయకపోవడంతో కోపంతో రైతులు గ్రోమోర్ సెంటర్ ముందు కర్రలతో నిప్పు పెట్టారు. తాళం వేసి ఉన్న గ్రోమోర్ సెంటర్ పై రాళ్లతో దాడికి దిగి తలుపు తాళం విరగ్గొట్టి గోడౌన్ లో ఉన్న యూరియా బస్తాలను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు యూరియా అందిందచేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే, ఆధార్ కార్డులు తీసుకున్నా యూరియా ఇవ్వకుండా సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
మహబూబాబాద్: గ్రోమోర్ సెంటర్పై రైతుల దాడి
యూరియా సరఫరా చేయలేదనే ఆగ్రహంతో మహబూబాబాద్లోని గ్రోమోర్ సెంటర్ పై గురువారం రైతులు దాడికి దిగారు. ఈ సెంటర్ తలుపులు పగులగొట్టి యూరియాను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు

Latest News
చీరకట్టులో హీట్ పెంచిన నిధి అగర్వాల్
ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం
ఇది బ్లాక్బస్టర్ కాదు… ‘బాస్బస్టర్’! – అల్లు అర్జున్
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది : ఈనెల 24న లేదా 27న
రాత్రి బెడ్లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?
రియల్ మీ బాహుబలి బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఫిక్స్ !
క్యాబినెట్ పరిమాణంపై పరిమితులు.. దొడ్డిదోవన సలహాదారుల పేరిట పందేరం.. సేవ కోసమా? ప్రాపకం కోసమా?
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై జబర్ధస్త్ తగదు : హైకోర్టు కీలక ఆదేశాలు