విధాత : యూరియా సరఫరా చేయలేదనే ఆగ్రహంతో మహబూబాబాద్లోని గ్రోమోర్ సెంటర్ పై గురువారం రైతులు దాడికి దిగారు. ఈ సెంటర్ తలుపులు పగులగొట్టి యూరియాను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. యూరియా కోసం బుధవారమే తమ వద్ద నుంచి గ్రోమోర్ సెంటర్ సిబ్బంది ఆధార్ కార్డులు తీసుకుని గురువారం యూరియా ఇస్తామని చెప్పారని రైతులు అంటున్నారు. కానీ, గురువారం కూడా యూరియా సరఫరా చేయకపోవడంతో కోపంతో రైతులు గ్రోమోర్ సెంటర్ ముందు కర్రలతో నిప్పు పెట్టారు. తాళం వేసి ఉన్న గ్రోమోర్ సెంటర్ పై రాళ్లతో దాడికి దిగి తలుపు తాళం విరగ్గొట్టి గోడౌన్ లో ఉన్న యూరియా బస్తాలను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు యూరియా అందిందచేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే, ఆధార్ కార్డులు తీసుకున్నా యూరియా ఇవ్వకుండా సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
మహబూబాబాద్: గ్రోమోర్ సెంటర్పై రైతుల దాడి
యూరియా సరఫరా చేయలేదనే ఆగ్రహంతో మహబూబాబాద్లోని గ్రోమోర్ సెంటర్ పై గురువారం రైతులు దాడికి దిగారు. ఈ సెంటర్ తలుపులు పగులగొట్టి యూరియాను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు

Latest News
పోలవరం ప్రాజెక్ట్ లో ఇంజనీరింగ్ లో పాలు- భద్రతా ప్రమాణాల ఉల్లంఘన వివరించిన సెంటర్ ఫర్ లిబర్టీ
‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర జంటపై లవ్ సాంగ్
ఏపీలో మహిళా దినోత్సవ కానుకగా కొత్త పథకాలు..వారే అర్హులు!
కేటీఆర్ మూటల మాటలకు బల్మూరి, చామల కౌంటర్
‘ఉస్తాద్ భగత్సింగ్’ రీమేక్ కాదంటూ హరీష్ శంకర్ క్లారిటీ..
దుబాయ్ లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల !
‘రణబాలి’ స్టోరీ ఇదేనా..
డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు : గరికపాటి కీలక వ్యాఖ్యలు
కౌండిన్య తిరిగొచ్చిందోచ్..!
ఖమేనీ మరణం..ఆ మహిళల వీడియోలు వైరల్