విధాత : యూరియా సరఫరా చేయలేదనే ఆగ్రహంతో మహబూబాబాద్లోని గ్రోమోర్ సెంటర్ పై గురువారం రైతులు దాడికి దిగారు. ఈ సెంటర్ తలుపులు పగులగొట్టి యూరియాను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. యూరియా కోసం బుధవారమే తమ వద్ద నుంచి గ్రోమోర్ సెంటర్ సిబ్బంది ఆధార్ కార్డులు తీసుకుని గురువారం యూరియా ఇస్తామని చెప్పారని రైతులు అంటున్నారు. కానీ, గురువారం కూడా యూరియా సరఫరా చేయకపోవడంతో కోపంతో రైతులు గ్రోమోర్ సెంటర్ ముందు కర్రలతో నిప్పు పెట్టారు. తాళం వేసి ఉన్న గ్రోమోర్ సెంటర్ పై రాళ్లతో దాడికి దిగి తలుపు తాళం విరగ్గొట్టి గోడౌన్ లో ఉన్న యూరియా బస్తాలను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు యూరియా అందిందచేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే, ఆధార్ కార్డులు తీసుకున్నా యూరియా ఇవ్వకుండా సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
మహబూబాబాద్: గ్రోమోర్ సెంటర్పై రైతుల దాడి
యూరియా సరఫరా చేయలేదనే ఆగ్రహంతో మహబూబాబాద్లోని గ్రోమోర్ సెంటర్ పై గురువారం రైతులు దాడికి దిగారు. ఈ సెంటర్ తలుపులు పగులగొట్టి యూరియాను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు