* కారుణ్య నియామకాల వయోపరిమితి (ఏజ్ లిమిట్) పెంచుతూ నిర్ణయం
* కార్యరూపం దాల్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ
హైదరాబాద్: సింగరేణి కార్మిక కుటుంబాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న కారుణ్య నియామకాల వయో పరిమితి పెంపు కార్యరూపం దాల్చింది. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి, అనారోగ్యంతో (మెడికల్ అన్ఫిట్) ఉద్యోగ విరమణ చేసిన వారి పిల్లలను బదిలీ కార్మికునిగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలోకి తీసుకుంటారు. గతంలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారినే కారుణ్య నియామకాల కింద తీసుకునే వారు. కరోనా కాలంలో రెండేళ్ల పాటు వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో సింగరేణి కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారుణ్య నియామకాల వయో పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కారుణ్య నియామకాల వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వయో పరిమితి సడలిస్తూ ఇచ్చిన ఉత్తర్వును 2018, మార్చి 9వ తేదీ నుంచి అమలు చేస్తారు. ప్రస్తుత ఉత్తర్వుతో సింగరేణిలో వందలాది కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.
సింగరేణి కార్మిక కుటుంబాలకు శుభవార్త…
సింగరేణి కార్మిక కుటుంబాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న కారుణ్య నియామకాల వయో పరిమితి పెంపు కార్యరూపం దాల్చింది. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి, అనారోగ్యంతో (మెడికల్ అన్ఫిట్) ఉద్యోగ విరమణ చేసిన వారి పిల్లలను బదిలీ కార్మికునిగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలోకి తీసుకుంటారు.

Latest News
జీవన్ రెడ్డి పార్టీ మార్పు వరమా? శాపమా? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ
ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ విజయవంతం
అనుకున్నంతా అయింది : ఏప్రిల్ 30 నుండి.. జూన్కు 'పెద్ది'
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన
నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్
దక్షిణాదిపై డీలిమిటేషన్ బాంబు.. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం అత్యుత్సాహం