విధాత : బీఆరెస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ ఘనపూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆరెస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతో పాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 5 తేదీకి వాయిదా వేసింది.