సీఎంగా కేసీ­ఆర్ లేక­పో­వ­డాన్ని ప్రజలు జీర్ణిం­చు­కోలేకపోతున్నారు­

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ లేకపోవడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు

  • Publish Date - January 3, 2024 / 03:48 PM IST
  • బీఆ­రెస్‌ ఎంపీలు గెల­వ­కుంటే లోక్‌సభలో తెలంగాణ పదం మాయం
  • తెలం­గాణ ప్రయో­జ­నా­లకు ఏకైక ప్రతి­నిధి కేసీ­ఆర్‌
  • ఆయన పోరా­టం­తోనే తెలం­గా­ణకు అస్తిత్వం
  • కాంగ్రెస్‌ దుష్ప్రచారం వల్లే బీఆరెస్‌ ఓటమి
  • బీఆ­రెస్ వర్కింగ్ ప్రెసి­డెంట్ కేటీ­ఆర్‌ వ్యాఖ్యలు
  • ఆది­లా­బాద్ లోక్‌సభ స్థానంపై సమీక్ష

విధాత: ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ లేకపోవడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీఆ­రె­స్‌పై కాంగ్రెస్ చేసిన దుష్ప్ర­చారం, ఆ పార్టీ చేసిన 420 మోస­పూ­రిత హామీ­ల­తోనూ, ఉద్యో­గాల విష­యంలో చెప్పిన అబ­ద్ధా­లతోనే ఓడి­పో­య­మని ఆవేదన వ్యక్తం చేశారు. పార్ల­మెం­టులో తెలం­గాణ గళం విన­బ­డా­లంటే.. తెలం­గాణ బలం.. దళం చూడా­లంటే లోక్‌­సభ ఎన్ని­కల్లో బీఆ­రెస్ గెలు­వా­ల్సిన అవ­స­ర­ముం­దని అన్నారు. బీఆ­రెస్ ఎంపీలు గెలు­వ­క­పోతే తెలం­గాణ పదం మాయ­మ­వు­తుం­దని చెప్పారు. తెలం­గాణ ప్రయో­జ­నా­లకు ఏకైక ప్రతి­నిధి బీఆ­రెస్ మాత్ర­మే­నని చెప్పుకొన్నారు.


లోక్‌­సభ స్థానా­ల­వా­రీగా బీఆ­రెస్ ఎన్ని­కల సన్నా­హక సమా­వే­శాలు బుధ­వారం తెలం­గాణ భవ­న్‌లో ఆది­లా­బాద్ స్థానంతో ప్రారం­భ­మ­య్యాయి. అది­లా­బాద్ నియో­జ­క­వర్గం ముఖ్య నేత­లతో సమా­వేశం అనం­తరం కేటీ­ఆర్ మీడి­యాతో మాట్లా­డారు. తెలం­గాణ ప్రయో­జ­నాలు కాపా­డేది బీఆ­రెస్‌ మాత్ర­మే­నని, జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రా­నికి గౌరవ ప్రద­మైన నేతగా ఒకరు పేరు విన­బ­డు­తుం­దని, తెలం­గాణ పేరు చెప్ప­గానే గుర్తుకు వచ్చేది కేసీ­ఆర్ పేరు మాత్ర­మే­న­న్నారు. కేంద్రంతో తెలం­గాణ ప్రయో­జ­నాల కోసం పేగులు తెగే­దాక నిల­బడి కల­బ­డా­లంటే బీఆ­ర్‌­ఎ­స్‌కే సాధ్య­మ­న్నారు. తెలం­గాణ హక్కుల సాధ­నకు కొట్లా­డటం బీజేపీ, కాంగ్రెస్‌తో కాద­ని చెప్పారు. ‘గతంలో పార్ల­మెం­టులో ఎప్పు­డైనా తెలం­గాణ గురించి మోదీ, రాహుల్ మాట్లా­డారా?’ అని ఆయన ప్రశ్నిం­చారు. తెలం­గాణ ప్రయో­జ­నా­లకు శ్రీరా­మ­రక్ష బీఆ­రెస్ అన్నారు. బీఆ­రె­స్‌కు ప్రధాన కేంద్రం, ప్రధాన అజెండా తెలం­గాణ మాత్ర­మే­న­న్నారు.


 



సీఎంగా కేసీ­ఆర్ లేక­పో­వ­డాన్ని ప్రజలు జీర్ణిం­చు­కో­లే­క­పో­తు­న్నా­ర­న్నారు. బీఆ­రె­స్‌పై కాంగ్రెస్ చేసిన దుష్ప్ర­చారం, ఆ పార్టీ చేసిన 420మోస­పూ­రిత హామీ­ల­తోనూ, ఉద్యో­గాల విష­యంలో చెప్పిన అబ­ద్ధా­లతో మనం ఓడి­పో­య­మ­న్నారు. పార్టీని సంస్థా­గ­తంగా బలో­పేతం చేయ­డంలో చిన్న చిన్న పొర­పాట్లు జరి­గా­య­న్నారు. కాంగ్రెస్ పార్టీ 420 మోస­పూ­రిత హామీలు ఇచ్చి గెలి­చిం­దని, ఆ పార్టీ హామీల వైఫ­ల్యా­లను క్షేత్ర­స్థా­యిలో ఎక్క­డి­క­క్కడ ఎండ­గ­డ­తా­మ­న్నారు. లోక్‌­సభ ఎన్ని­కల్లో బీఆ­రెస్ మంచి విజ­యాలు నమోదు చేస్తుం­దని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇతర రాష్ట్రా­లకు విస్త­రిం­చా­లని ఆకాంక్ష ఉన్న­ప్ప­టికీ మాకు ప్రధాన కేంద్రం హైద­రా­బాద్‌, తెలం­గాణ. మా ప్రధాన ఎజెం­డానే తెలం­గాణ. కాబట్టి.. తెలం­గాణ కోసం, సమ­స్యలు, హక్కులు, వాటాల కోసం ప్రత్యే­కంగా పోరా­డ­గ­లి­గేది.. బలంగా కృషి చేయ­గ­లి­గేది బీఆ­రెస్ ఒక్క­టే­’ అని చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్ని మాట్లా­డినా కేసీ­ఆ­ర్‌­తోనే తెలం­గాణ వచ్చిం­ద­న్నది నిర్వి­వా­ద­మైన అంశ­మని అన్నారు. కేసీ­ఆ­ర్‌­తోనే ఈ రాష్ట్రా­నికి అస్థిత్వం వచ్చిం­దని, తెలం­గా­ణకు పర్యా­య­ప­దంగా కేసీ­ఆర్ నిలి­చా­రని కేటీ­ఆర్ పున­రు­ద్ఘా­టిం­చారు. తెలం­గాణ సాధన కోసం కేసీ­ఆర్ చేసిన కృషిని ఈ సంద­ర్భంగా మరో­సారి ఏక­రవు పెట్టారు.