పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా నిలబడదాం

ఇజ్రాయిల్ అమెరికా దేశాలు పాలస్తీనా ప్రజల పైన చేస్తున్న యుద్ధ ఉన్మాద దాడులను ఖండిస్తూ ప్రత్యామ్నాయ పౌర సమూహం(సి సి ఏ) ఖ‌మ్మం లో నిరసన కార్యక్రమం జరిగింది

  • Publish Date - January 13, 2024 / 11:32 AM IST
  • ఇజ్రాయిల్ అమెరికా యుద్ధ ఉన్మాదాన్ని ఖండిద్దాం
  • ప్రత్యామ్నాయ పౌర సమూహం ఆధ్వ‌ర్యంలో మాన‌వ హారం
  • పాల్గొన్న సీపీఐ,సీపీఎం, సీపీఐఎంఎల్ పార్టీల నాయ‌కులు

ఖ‌మ్మం: ఇజ్రాయిల్ అమెరికా దేశాలు పాలస్తీనా ప్రజల పైన చేస్తున్న యుద్ధ ఉన్మాద దాడులను ఖండిస్తూ ప్రత్యామ్నాయ పౌర సమూహం(సి సి ఏ) ఖ‌మ్మం జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. సీసీఏ ప్రతినిధులు , వామపక్ష పార్టీలు , వివిధ ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు , అభ్యుదయవాదులు, పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ మానవహారాన్ని నిర్వహించారు.

ఇజ్రాయిల్ , అమెరికాలు పాలస్తీనా లోని గాజా , ఇతర ప్రాంతాల పైన చేస్తున్నటువంటి దాడుల వలన పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పౌర స్థావరాల పైన సైతం దాడులు జరగడం వలన అనేకమంది పౌరులు చనిపోతున్నారని , పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరుగుతోందని తెలిపారు. పసిపిల్లలు , వృద్ధులు , మహిళలు నిస్సాహాయక స్థితిలో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను , ప్రపంచ దేశాల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా అమెరికా ఇజ్రాయిల్ దుర్మార్గంగా పాలస్తీనా పైన యుద్ధాన్ని చేస్తున్నాయని అన్నారు . ఈ యుద్ధ ప్రభావం కేవలం పాలస్తీనా వరకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపిస్తుందని , ఆర్థికంగా కూడా చాలా నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధ ఉన్మాదాన్ని ప్రపంచంలోని ప్రజాస్వామిక వాదులందరూ నిరసించాలని కోరారు. పాలస్తీనా ప్రజలకు ప్రపంచ ప్రజలు సంఘీభావంగా నిలబడాలని , వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. అంతర్జాతీయ సంస్థలు , ప్రపంచ దేశాలు అమెరికా ఇజ్రాయిల్ పైన ఒత్తిడి పెంచి యుద్ధ‌ ఉన్మాదాన్ని ఆపేలా చేయాలని వారు కోరారు.


 


ఈ కార్య‌క్ర‌మంలో సీసీఏ ప్రతినిధులు డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్ , డాక్టర్ రవీంద్రనాథ్, రవి మారుత్, రెహానా బేగం, కాకి భాస్కర్, విజయ్ , శేషగిరిరావు, బండారు రమేష్ , సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు , రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ ,పొన్నం వెంకటేశ్వరరావు , సిపిఐ యం యల్ నాయకులు పాముల మోహన్ రావు ల‌తో పాటు వామ‌ప‌క్ష పార్టీల నాయ‌కులు గోకినపల్లి వెంకటేశ్వర్లు, యర్రా శ్రీనివాసరావు సింగు నరసింహారావు,పోటు కళావతి ,ఆవుల అశోక్ ,ఝాన్సీ, మాదినేని రమేష్‌ , మెరుగు సత్యనారాయణ , జి.రామయ్య ,ఆకుల గాంధీ , ఆజాద్ , మస్తాన్, వెంకటేష్ ,మురళీ , యస్ యం.రఫీ , షేక్ మతీన్ , పిన్నింటి రమ్య , ఆర్.ప్రకాష్ , సమీ , వసామా తదితరులు పాల్గొన్నారు.