విధాత: తెలంగాణ మీడియా అకాడమీ చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఇటీవల మరణించిన 34 జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం మీడియా అకాడమీ అందిస్తుందని అకాడమీ చైర్మన్ కే .శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ఆరు నెలల వ్యవధిలోని ఈ జర్నలిస్టులు చనిపోయారని అన్నారు .వీరి కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం తో పాటు చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు నెలకు 3000 రూపాయలు పెన్షన్ అకాడమీ ఇస్తుందని, ఇది ఐదు సంవత్సరాల పాటు అందజేస్తామని అన్నారు. పెన్షన్ తో పాటు వారి పిల్లలకు ఎల్ కేజీ నుండి పదవ తరగతి వరకు చదువుకోవడానికి నెలకు 1000 రూపాయల అందజేస్తామన్నారు.
ప్రాణాంతకర వ్యాధులతో బాధపడుతూ ప్రమాదానికి గురైన జర్నలిస్టులకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని శ్రీ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు పరిశీలించిన దరఖాస్తులలో క్యాన్సర్ తో బాధపడుతున్న జర్నలిస్ట్ గురు ప్రసాద్ ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న బండి నారాయణకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మంజూరు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. వీరితోపాటు మరో ఇద్దరూ జర్నలిస్టులకు 50 వేల రూపాయలు మంజూరు చేసినట్ల వెల్లడించారు. ఈ సమావేశంలో శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రెటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ పిసి వెంకటేశం, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
చనిపోయిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన … మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఇటీవల మరణించిన 34 జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం మీడియా అకాడమీ అందిస్తుందని అకాడమీ చైర్మన్ కే .శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

Latest News
న్యూజీలాండ్దే రెండో వన్డే : విజేతను నిర్ణయించేది ఇక మూడో మ్యాచ్
వర్కింగ్ జర్నలిస్టులను బలి పశువులను చేయకండి
తిరుమల విమాన వెంకటేశ్వురుడికి ‘కాకబలి’ నివేదన చూడండి
గమ్యం చేరిన ఐఎన్ఎస్వీ కౌండిన్య తెర చాప నౌక
ఐకాన్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్పై క్రేజీ అనౌన్స్మెంట్..
మహిళలను అవమానించే కథనాలు ఆమోదయోగ్యం కాదు: సీపీ సజ్జనార్
రాజ్ కోట్ వన్డేలో న్యూజిలాండ్ టార్గెట్ 285
శిక్షణా తరగతులను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి
చైనా మాంజాకు మరొకరి బలి !
వండర్ .. కిలో మల్లెపూలు రూ.6వేలు !