విధాత: తెలంగాణ మీడియా అకాడమీ చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఇటీవల మరణించిన 34 జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం మీడియా అకాడమీ అందిస్తుందని అకాడమీ చైర్మన్ కే .శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ఆరు నెలల వ్యవధిలోని ఈ జర్నలిస్టులు చనిపోయారని అన్నారు .వీరి కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం తో పాటు చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు నెలకు 3000 రూపాయలు పెన్షన్ అకాడమీ ఇస్తుందని, ఇది ఐదు సంవత్సరాల పాటు అందజేస్తామని అన్నారు. పెన్షన్ తో పాటు వారి పిల్లలకు ఎల్ కేజీ నుండి పదవ తరగతి వరకు చదువుకోవడానికి నెలకు 1000 రూపాయల అందజేస్తామన్నారు.
ప్రాణాంతకర వ్యాధులతో బాధపడుతూ ప్రమాదానికి గురైన జర్నలిస్టులకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని శ్రీ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు పరిశీలించిన దరఖాస్తులలో క్యాన్సర్ తో బాధపడుతున్న జర్నలిస్ట్ గురు ప్రసాద్ ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న బండి నారాయణకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మంజూరు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. వీరితోపాటు మరో ఇద్దరూ జర్నలిస్టులకు 50 వేల రూపాయలు మంజూరు చేసినట్ల వెల్లడించారు. ఈ సమావేశంలో శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రెటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ పిసి వెంకటేశం, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
చనిపోయిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన … మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఇటీవల మరణించిన 34 జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం మీడియా అకాడమీ అందిస్తుందని అకాడమీ చైర్మన్ కే .శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

Latest News
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు