విధాత, వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలోని మండల కేంద్రాల నుంచి ఉన్న ప్రధాన రహదారులన్నింటికి మరమ్మతులు, కొత్త రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం దీనికి సంబంధించిన వివరాలు పెద్ది వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణ పనుల కోసం రూ.40 కోట్ల 30 లక్షలు మంజూరైనట్లు చెప్పారు.
గత సంవత్సరంలో నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా అత్యధిక వర్షాలు కురవడం వలన రోడ్లు ధ్వంసమయ్యాయని గుర్తు చేశారు. ధ్వంసమైన రోడ్ల మరమ్మతులతో పాటు, నూతన రోడ్ల నిర్మాణాలు చేపట్టడానికి చేసిన ప్రయత్నం ఫలించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
మంజూరైన రోడ్లు, నిధులు..
త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి కానుందన్నారు. వెనువెంటనే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.