విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష బీఆరెస్ సభ్యులను మాట్లాడినివ్వకుండా చేసున్న సీఎం రేవంత్రెడ్డి సబితక్కనే చూసి వణికిపోతున్నాడని మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. సభ నుంచి వాకౌట్ చేసి, పోలీసులతో బలవంతంగా తెలంగాణ భవన్కు తరలించబడిన బీఆరెస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సభకు రావాలని మాట్లాడుతున్న కాంగ్రెస్ లిల్లిపుట్లకు దమ్ముంటే కేసీఆర్ తరుపున సబితక్కకు రెండు నిమిషాల సమయం మాట్లాడేందుకు ఇవ్వాలన్నారు. సబితక్కకు రెండు నిమిషాలు సమయం ఇవ్వడానికి వణికి పోతున్న మీకు కేసీఆర్ దేనికి రా అంటూ మండిపడ్డారు. సబిత మైక్ అడిగితే రూల్స్ మాట్లాడుతూ పిరికిపందల్లా చర్చకు పారిపోతున్నారన్నారు. ఊర కుక్కల్లాగా సబితక్క పైన, తెలంగాణ మహిళాలోకంపైన సభలో ఎట్లా విరుచుకుపడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తుందన్నారు. నీవు గతంలో తుపాకులు పట్టి తిరిగిండొచ్చు కాని ఈరోజు సీఎంగా ఉన్నావని గర్తు పెట్టుకోవాలన్నారు. ఈ రోజు ఫ్రజలు అల్పబుద్ధివారికి అధికారమిచ్చిన అనే వేమన శతకాన్ని గుర్తు చేసుకుంటున్నాన్నారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూనేను సమయమడిగితే రూల్స్ చెబుతున్నారని, మరి ఆదివాసీ మహిళయైన మా ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఎస్సీ వర్గీకరణ మీద రెండు నిమిషాలు మాట్లాడుతానంటే కూడా మైక్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ మా మహిళా శాసన సభ్యులను కన్నీళ్లు పెట్టించినందుకు నీకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుందని హెచ్చరించారు.
G. Jagadish Reddy | సబితక్కనే చూసి వణికి పోతున్నారు..మీకు కేసీఆర్ ఎందుకు మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి విసుర్లు
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష బీఆరెస్ సభ్యులను మాట్లాడినివ్వకుండా చేసున్న సీఎం రేవంత్రెడ్డి సబితక్కనే చూసి వణికిపోతున్నాడని మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు.

Latest News
Vivo T5 | 7200mAh బ్యాటరీతో వివో T5 స్మార్ట్ఫోన్ విడుదల.. ఫీచర్లు ఏంటంటే..!
Claude AI Bill | వామ్మో! ఒక్క నెలకే 4 వేల కోట్ల బిల్లు.. అడ్డూఅదుపు లేకుండా ఏఐని వాడటంతో అమెరికన్ కంపెనీకి షాక్!
IPL Final Match | ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేళ.. క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పిన ఐఆర్సీటీసీ
నల్లమలలో చరిత్ర జాడల అన్వేషణకు ఏఎస్ఐకి అనుమతి
కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్
ఉద్యమకారుల గుర్తింపు ప్రత్యేక కమిటీ తొలి భేటీ
రాజస్థాన్ లో విరుచుకుపడిన ఇసుక తుపాను
షాకింగ్.. సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ టాప్
కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
రూ.5,500కోట్ల విలువైన భూమిని రక్షించిన హైడ్రా