Special Trains | మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..! సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌ నుంచి నడిచే రైళ్లు ఇవే..!

Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది.

  • Publish Date - April 22, 2024 / 10:33 AM IST

Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది. తాజాగా సికింద్రాబాద్‌-ముజఫరాబాద్‌, మహబూబ్‌నగర్‌-గోరక్‌పూర్‌తో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఆయా ప్రత్యేక రైళ్లు ఈ నెల 23 నుంచి జూలై ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఆయా ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Latest News