విధాత: యాదాద్రి నిర్మాణంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి స్పందించారు కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు.తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్ పాలన సాగుతోంది,రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి.సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్దారు కేసీఆర్.కేసీఆర్ మైలురాళ్లలో తెలంగాణ సాధనతో పాటు యాదాద్రి నిర్మాణం కూడా చిరస్థాయిగా నిలుస్తుంది,యాదాద్రిలో వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు.