విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన 317జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు విసిరేయబడిన ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాలకు బదిలీ చేసేందుకు పెండింగ్లో ఉన్న13 జిల్లాల స్పౌజ్ బదిలీలు వెంటనే జరిపించి ఆదుకోవాలని మహిళా ఉపాధ్యాయులు సీఎం రేవంత్రెడ్డికి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మహిళా ఉపాధ్యాయుల బాధలను రాష్ట్ర పెద్దగా, ఒక అన్న గా తొలగించాలని వారు వేడుకున్నారు. బడులు తెరుస్తున్నారంటేనే భయాందోళనకు గురౌతున్నామని, రోజు 100కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చుగాని…200-300కిలోమీటర్లు ప్రయాణాలు చేయలేక, పని చేసే చోట రూములు తీసుకుని కుటుంబాలను విడిచి ఉండలేక మానసిక రుగ్మతలకు లోనయ్యామని వారు వాపోయారు. దయచేసి ఒక్క జిల్లాలో మా ఉపాధ్యాయ దంపతులను పోస్టింగ్ చేయండని, మీ ఋణం తీర్చుకోలేమని, కాని ఋణపడి ఉంటామన్నారు. గతంలో బీఆరెస్ హయాంలో తెచ్చిన 317జీవోతో వేర్వేరు జిల్లాలకు బదిలీయైన ఉపాధ్యాయ దంపతుల నుంచి ఎదురైన నిరసనతో 615మంది వరకు స్పౌజ్ బదిలీలు చేపట్టింది. అయితే మరో 1500వరకు స్పౌజ్ బదిలీలు పెండింగ్లో ఉన్నాయి. అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఇందుకోసం ఎప్పుడు చర్యలు తీసుకుంటారన్నదానిపై ఎదురుచూపులు పడుతున్నారు.
స్పౌజ్ బదిలీలు జరిపించండి సీఎం రేవంత్రెడ్డికి ఉపాధ్యాయుల వినతి
బీఆరెస్ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన 317జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు విసిరేయబడిన ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాలకు బదిలీ చేసేందుకు పెండింగ్లో ఉన్న13 జిల్లాల స్పౌజ్ బదిలీలు వెంటనే జరిపించి ఆదుకోవాలని మహిళా ఉపాధ్యాయులు సీఎం రేవంత్రెడ్డికి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Latest News
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్