హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విధాత): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను పక్కకు పెట్టి నష్ట పరిహారం చెల్లించకపోవడంతో సదరు నిర్వాసితురాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే సదరు కలెక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మిడ్ మానేరు నిర్వాసితురాలికి గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని తెలిపింది. అయితే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అంశంపై ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి ఆదేశాలు రావడంతో అతనిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Siricilla Collector : సిరిసిల్ల కలెక్టర్కు హైకోర్టు మరో షాక్
మిడ్ మానేరు నిర్వాసితురాలికి నష్టం చెల్లింపులపై సిరిసిల్ల కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

Latest News
ఈ వారం ఓటీటీలో.. : చిత్రాలు – సిరీస్లు(డిసెంబర్ 01–07)
వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు
పాతికేళ్లలో తొమ్మిది ఎయిర్ లైన్స్ కనుమరుగు.. ఇండిగో నెక్ట్స్?
రెఫరెండమన్నడికి సిగ్గు లేదు.. మళ్ల నోరేసుకుని తిరుగుతుండు: కేటీఆర్పై రేవంత్ ఫైర్
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్
అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు.. వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్
అప్పటి పరిస్థితుల వల్లే పవన్ కల్యాణ్ పై విమర్శలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు
ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ